BRS – Congress : కర్ణాటక ఎన్నికలు యావత్ దేశానికి షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా తెలంగాణకు.. అసలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పు చెప్పడంతో ఆ పార్టీకి ఓ రేంజ్లో బూస్ట్ ఇవ్వగా.. మిగిలిన పార్టీలకు మాత్రం పెద్ద షాకే ఇచ్చాయి. నిజానికి కర్ణాటకలో హంగ్ రావొచ్చని భావించారంతా. కానీ అది జరగలేదు. ఈ ఫలితాలు ముఖ్యంగా తెలంగాణకు పెద్ద షాక్ ఇచ్చాయి. ఫలితాల మాటేమో కానీ ప్రస్తుతం ఎవరి లెక్కలు వారివి.. కర్ణాటక ఫలితంతో కొత్త సమీకరణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏంటా సమీకరణాలు..? అవి బీఆర్ఎస్కు లాభిస్తాయా? లేదంటే కాంగ్రెస్ పార్టీకా? అనే విషయాలపై ప్రత్యేక కథనం..
సరిహద్దు ఓటర్లు సైతం కాంగ్రెస్ వైపే..
కర్ణాటక ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఉండే చోట.. అలాగే తెలంగాణ – కర్ణాటక సరిహద్దులోనూ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపడం ఆసక్తికరంగా మారింది. నిజానికి కర్ణాటకపై కేసీఆర్ మరింత దృష్టి సారించారు. జేడీఎస్ అధినేత కుమారస్వామిని అడ్డు పెట్టుకుని కర్ణాటకలో చక్రం తిప్పాలనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కర్ణాటకలో కాంగ్రెస్కు మద్దతుగా నిలిచిన ఓటర్లు మరి తెలంగాణలో ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అక్కడి ఫలితాలు కొత్త సమీకరణాలకు దోహదపడుతున్నాయి. త్వరలో తెలంగాణలో జరగనున్న ఎన్నికలను ఈ ఎన్నికల ఫలితం ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Advertisement
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందా?
నిజానికి బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన తర్వాత కర్ణాటకతోనే సీఎం కేసీఆర్ ఎక్కువగా సంబంధ బాంధవ్యాలను కొనసాగించారు. కాబట్టి కర్ణాటక ఎన్నికల ఫలితం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని అంతా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కొత్త లెక్కలు వేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతగా చీలి తమకు లాభం చేకూరుస్తుందని.. బీఆర్ఎస్కు నష్టం చేస్తుందని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు పెరిగిందంటే అది తమకు ఎంత మేర నష్టం చేకూరుస్తుందనే లెక్కలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా కేసీఆర్ ప్రభావమే పొరుగు జిల్లాలపై పడిందనే వాదన వినిపిస్తోంది. ఇదే నిజమైతే తెలంగాణలోనూ బీఆర్ఎస్కు నష్టం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బీఆర్ఎస్కు గడ్డుకాలమేనా?
మొత్తానికి వార్ సీన్లో నుంచి బీజేపీ సైడ్ అయిపోయి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కానుందని రాజకీయ వర్గాల్లో బీభత్సంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజలను కాంగ్రెస్ వైపునకు మళ్లించే యత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం యాక్టివ్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికల ఫలితాలు సైతం కాంగ్రెస్ ఉత్సాహానికి కారణమయ్యాయి. మొత్తానికి బీఆర్ఎస్కు రానున్నది గడ్డుకాలమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు మహారాష్ట్రలో ఏదో సాధిద్దాం అనుకుంటే అక్కడ బొక్కబోర్లా పడింది. ఇక కర్ణాటకలో చక్రం తిప్పాలనుకుంటే అక్కడ కూడా అదే పరిస్థితి. మొత్తానికి తెలంగాణ రాజకీయం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.. రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దాం..!
Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.
ఇక రాంచరణ్ సినిమాలలో రంగస్థలం సినిమా కూడా ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక సాధారణ వ్యక్తి లాగా సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇచ్చారు ఈ విషయం గురించి సుకుమార్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది.
ఇలా ఒక స్టార్ హీరోని ఇంత సింపుల్గా చూపించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మీలో కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ..కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.
Advertisement
నాలుగైదు టేకులు.. నాలుగైదు టేకులు చేసిన మంచిగా రాకపోవడంతో ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Venu: జబర్దస్త్ కమెడియన్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈయన బలగం అనే సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు తదుపరి సినిమా నానితో చేసే అవకాశాన్ని అందుకున్నారు త్వరలోనే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన విషయాలు తెలియచేయబోతున్నారు.
ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిపి ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమోలో భాగంగా బలగమా సినిమా గురించి ప్రశ్నలు వేశారు.
Advertisement
ఈ సందర్భంగా వేణు సమాధానం చెబుతూ తాను బలగం సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది టెక్నీషియన్ లతో మాట్లాడుతూ ఉండగా కొందరు నన్ను అవమానపరిచారని తెలిపారు. ఏదో పెద్ద బాహుబలి సినిమా చేస్తున్నావా ఏంటి అంటూ అవమానించారని వేణు తెలిపారు.
చిన్న సినిమాలలో బాహుబలి.. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మీరు ఈ సినిమాపై స్పందిస్తూ చిన్న సినిమాలలో బాహుబలి అంటూ కామెంట్స్ చేయడం తను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా వేణు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.
ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.
Advertisement
జగన్ అంటే అభిమానం.. ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.