ఈ కామర్స్ సంస్థల్లో ముఖ్యంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. భారీ ఆఫర్లతో ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ఫోన్స్ కార్నివాల్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో అద్భుత ఆపర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంఐ 11 లైట్ స్మార్ట్ఫోన్ను కేవలం రూ.3,999 కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది.

వివరాల్లోకి వెళ్తే.. గ్జియామీ ఎంఐ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదట చైనా ప్రొడక్ట్ ఇండియాలో లాంచ్ చేసి.. కొన్ని కోట్ల మొబైల్ లను విక్రయించింది. అంతలా ఎంఐ మొబైల్ ఫోన్లకు ఆకర్శితులయ్యారు. ఆ తర్వాత ఇండియలోనే తయారు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.21,999 విలువైన ఎంఐ 11 లైట్ స్మార్ట్ఫోన్ను రూ.3,999 ధరకే కొనొచ్చు.
ఈ ఆఫర్ సెప్టెంబర్ 8 వరకు ఉందని పేర్కొన్నారు. మీ దగ్గర దాదాపు రూ.15, 000 విలువ చేసే మొబైల్ ఉన్నట్లయితే.. ఈ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చని తెలిపారు. దీనికి అదనంగా మరో రూ.3 వేలు ఫ్లిప్ కార్టు అందిస్తుంది. దీంతో మొత్తం మీద రూ.18 వేలు ఎక్సేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.
దీంతో పాటు ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ఉంటే.. మరో రూ.1500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఆ మొబైల్ మనకు కేవలం రూ.2,499కి లభిస్తుంది. ఇలా ఎంఐ మొబైల్ ను సొంతం చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఇంకెందుకు ఆలస్యం అతి తక్కువ ధరకు మొబైల్ ను మీ సొంతం చేసుకునేందుకు ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ వెబ్ సైట్ కు వెళ్లి బుక్ చేసుకోండి.































