ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలోని ప్రజలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. సాధారణ రోజులతో పోల్చి చూస్తే పండుగ సమయాల్లో, పెళ్లి సమయాల్లో ఎక్కువగా బంగారం కొనుగోళ్లు జరుగుతాయి. సాధారణంగా డబ్బులు చెల్లించి ఎవరైనా బంగారం కొనుగోలు చేయవచ్చు. అయితే కేంద్రం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుందని.. ఇకపై కేవైసీ డాక్యుమెంట్లు ఉంటే మాత్రమే బంగారం కొనుగోలు చేసేలా నిబంధనలు రానున్నాయని తెలుస్తోంది.

ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం ఇకపై బంగారం కొనుగోలు చేయాలని వెళ్లేవాళ్లు తమతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నగదు రూపంలో బంగారం కొనుగోలు చేసేవాళ్లు తప్పనిసరిగా కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందని సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఇప్పటికే జువెలరీ రంగానికి మనీ లాండరింగ్ చట్టాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ఇకపై బంగారానికి సైతం కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాలని నియమనిబంధనలను అమలులోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యువెలరీ సంస్థలు అనుమానాస్పద లావాదేవీలు జరిపితే ప్రభుత్వ కంపెనీలు వివరణ కోరే అవకాశాలు ఉంటాయి. అందువల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఇప్పటికే పలు జ్యువెలరీ సంస్థలు కేవైసీ డాక్యుమెంట్లను కోరుతున్నాయని తెలుస్తోంది.
2 లక్షల రూపాయల లోపు బంగారం కొనుగోలు చేసినా బంగారం కొనుగోలు చేసిన వాళ్లు కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుందని సమాచారం. కేంద్రం నిబంధనల వల్ల కొనుగోలుదారులు సైతం కేవైసీ డాక్యుమెంట్ల విషయంలో గందరగోళానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల సమయంలో బంగారం కొనుగోళ్లకు కేవైసీ డాక్యుమెంట్లకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.































