C. Kalyan : సికే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను 2011లో ప్రారంభించి మొదటగా తమిళ సినిమా చంద్రకళ నిర్మించారు కళ్యాణ్. సుందర్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత జ్యోతి లక్ష్మి, లోఫర్, జై సింహ సినిమాలు నిర్మించాడు. ఇక రామ్ గోపాల్ వర్మతో వివాదంతో బాగా ఫేమస్ అయిన కళ్యాణ్ అంతకుముందు వందేళ్ల సినిమా వేడుకకు కన్వీనర్ గా వ్యవహరించిన సందర్బంలో కూడా గొడవలతో బాగా ఫేమస్ అయ్యాడు.

జయలలిత బినామీ అయితే ఏంటి…
సి కళ్యాణ్ గురించి మొదటి నుండి వివాదాలు ఉన్నాయి, మద్దెలచెరువు సూరి, నయీం వంటి వారితో సంబంధాలు ఉండి సెటిల్ మెంట్స్ చేసాడు. అయితే దీనికి సి. కళ్యాణ్ వారితో సంబంధాలు ఉంటే తప్పేంటి, డాన్ గా తప్పులు చేయలేదు, డాన్ అనేది ఒక గ్లామర్ అంటూ మాట్లాడారు. ఇక జయలలిత ఆస్తులకు బినామీగా వ్యవహారించారనే వాదనకు సమాధానం ఇచ్చారు. ఉంటే తప్పేంటి వాళ్ళ బంధువులకు గానీ, సన్నిహితులకు గానీ లేని అభ్యంతరం మీకెందుకు, నా తల్లి కంటే జయలలిత అమ్మ నాకు ఎక్కువ. అమ్మ ఇవ్వాలనుకున్నవన్నీ ఇచ్చుంటే జూబ్లీహిల్స్ మొత్తం నా చేతిలో ఉండేది. ఇక అమ్మ చనిపోయినా పై నుండి అన్ని చూస్తుంటుంది, ఆవిడ చుట్టూ ఉన్న వ్యక్తులు తప్పులు చేసుండొచ్చు కానీ ఆమె మనస్తత్వం మంచిది. ఇక ఇప్పటికీ తమిళనాడు మంత్రులు, ఎమ్మెల్యే లు నన్ను ఛాంబర్ కళ్యాణ్ అంటారని చెప్పారు.

ఆవిడ ద్వారా లబ్ది పొంది చనిపోయాక తప్పుగా మాట్లాడితే అమ్మ అన్నీ చూస్తుంటుంది వారికి ఏం జరగాలో అది జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక వందేళ్ల సినిమా వేడుకలకు కన్వీనర్ గా వ్యవహరించడం వల్ల నా పేరు జయలలిత, ప్రణబ్ ముఖర్జీ, రోశయ్య గార్ల పేర్లతో సహా చరిత్రలో ఉంటుంది. అంతకన్నా ఏం కావాలి అంటూ చెప్పారు. ఇక ఆ సమయంలో వచ్చిన వివాదాలకు ఇలా సమాధానం చెప్పారు. ఆ సమయంలోని విషయాలు ఎవరూ గుర్తుంచుకోరు కేవలం ఎవరు ఆ వేడుక నిర్వహించారు, అతిధులు ఎవరు అన్నదే చరిత్ర లో ఉంటుంది అని వాఖ్యణించారు.

































