కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు గల వారు ఇకపై ఎటువంటి ముందస్తు నమోదు లేకుండానే ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ఆన్ సైట్ లేదా వాక్-ఇన్ రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ వేయించుకునేందుకు వీలు కల్పించింది.

టీకాల వృధాగా పోతున్న నేపధ్యంలో వాటిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్తున్నాటు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకాల కోసం ఆన్లైన్ లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న లబ్దిదారులు ఒకవేళ ఆ రోజు రాకపోతే ఆ టీకా డోసులు నిరుపయోగంగా మారుతున్నాయి. ఈ నేపద్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఎవరైనా అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.































