Chandhra Mahesh : తెలుగులో ఎంతోమంది కెరీర్ వెతుక్కుంటూ తమ ప్రతిభను నిరూపించుకోవాలని సినిమా ఇండస్ట్రీ లోకి వస్తారు. అలా వచ్చిన వ్యక్తే చంద్ర మహేష్. తూర్పు గోదావరి జిల్లా కు చెందిన చంద్ర మహేష్, సురేష్ ప్రొడక్షన్ హౌస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. ‘ధర్మచక్రం’ వంటి సినిమాకు పనిచేసిన చంద్ర మహేష్ ఆ తరువాత 1999 లో శ్రీకాంత్ తో తీరిన ‘ప్రేయసి రావే’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత శ్రీహరి గారితో ఒక్కడే, అయోధ్య రామయ్య చెప్పాలని ఉంది వంటి సినిమాలతో హిట్ కొట్టాడు.

వేణు, తరుణ్ ల ఇగో వల్ల సినిమా ఆగిపోయింది…
చంద్ర మహేష్ మొదటి నుండి సురేష్ ప్రొడక్షన్ లోనే సినిమా చేయాలని భావించి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడే సురేష్ ప్రొడక్షన్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఇక ప్రేయసి రావే సినిమా హిట్ తరువాత గుర్తింపు తెచ్చుకున్న చంద్ర మహేష్ అయోధ్య రామయ్య సినిమా తరువాత ఆకుల శివ ఒక కథను సిద్ధం చేయగా సురేష్ ప్రొడక్షన్ లో సినిమా ప్లాన్ చేసారు. అయితే మొదట హీరోగా తరుణ్ ని అనుకొంటే నువ్వే కావలి సినిమా హిట్ తో బిజీ అయిన తరుణ్ కి ప్రొడ్యూసర్ తో ఇగో క్లాషెస్ వల్ల సినిమా ముందుకు సాగలేదు. ఇక కథ కొంచెం మార్చి వేణు తోట్టెంపూడి తో సినిమా చేయాలని అనుకుంటే చిరునవ్వుతో సినిమా హిట్ వల్ల ఆయనకు ప్రొడ్యూసర్, ఇతర ఇగో క్లాషెస్ వల్ల చేయలేదు. ఇక స్టోరీ మార్చి వడ్డే నవీన్ గారికి కథ చెప్పితే ఆయన ఓకే చేసారు. అలా చెప్పాలని ఉంది సినిమా చేసాము అంటూ అప్పటీ సంగతిలను చెప్పారు.
బ్రహ్మానందం కొడుకు సినిమా అలా ఆగిపోయింది…

చంద్ర మహేష్, రైటర్ అశోక్ కుమార్ కాంబినేషన్ లో బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా ఒక సినిమా అనుకున్నాక ఆ సినిమా చేయలేదు. కథను అశోక్ కుమార్ సిద్ధం చేసాక ఆ కథను తన స్నేహితులు నలుగురితో చంద్ర మహేష్ గారు చర్చించినపుడు కథకు మార్పులు సూచిస్తారని అనుకుంటే చివరికి కథ కంచికి పోయిందని సినిమా చేయలేక పోయానని చంద్ర మహేష్ చెప్పారు. ఇక కొన్ని రోజులయ్యాక అశోక్ కుమార్ కనిపించి నా కథను అందరితో చర్చించి ఎన్ని ముక్కలు చేశారో చూడండి అన్నాడట. ఆ సినిమాలో ఒక ముక్క రెడీ సినిమా, ఒక ముక్క పరుగు సినిమా అలా వచ్చాయని అశోక్ చెప్పినపుడు సేమ్ కాన్సెప్ట్ ఐడియా వారికి వచ్చుండొచ్చు వదిలేయ్ అని చెప్పానని చంద్ర మహేష్ చెప్పాడు. అలా గౌతమ్ తో సినిమా ఆగిపోయింది.































