’నీతోడుకావాలి’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది అందాల తార ఛార్మీ. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా నటించిన ‘నీకే మనసిచ్చాను’ చిత్రంలో కూడా నటించింది. అయినప్పటికి ఈ భామకు అంతగా ఆఫర్స్ రాలేదు. కానీ కృష్ణవంశీ డైరెక్షన్లో చేసిన ‘శ్రీ ఆంజనేయం’ చిత్రంలో ఓ రేంజ్ లో స్కిన్ షో చేసి అందరి మనసు ఆకట్టుకుంది. ఆ సినిమా ఆశించినంత హిట్ కాకపోయినా.. ఛార్మీకి మాత్రం మంచి పేరు వచ్చింది. అందుకే ఆ తర్వాత వరసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. తక్కువ సమయంలోనే ప్రభాస్,రవితేజ, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ చేసింది. ‘మంత్ర’ ‘మంగళ’ ‘జ్యోతి లక్ష్మీ’ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది.

తర్వాత ఎందుకో నటనకు స్వస్తి చెప్పి.. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు సహ నిర్మాతగా బాధ్యతలు తీసుకుంది. అయితే పూరి జగన్నాథ్ తో ఛార్మీ డేటింగ్ లో ఉందనే సంచలన వార్తలు కూడా మీడియాలో హల్ చల్ చేశాయి. వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం చూసి ఇది నిజంగా డేటింగే అని అనుకున్నారు. అయితే ఈ వార్తలను ఛార్మీ ఖండిచింది. ’పూరి తనకు మంచి ఫ్రెండ్’ అని తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఛార్మీ పెళ్ళి చేసుకోవడానికి ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ‘లాక్ డౌన్ కారణంగానే పెళ్ళి వాయిదా పడిందని లేకుంటే.. ఈపాటికి ఛార్మీ పెళ్ళైపోయేదని’ ఇన్సైడ్ టాక్. మరి ఈ గాసిప్ లో నిజానిజాలేమిటో తెలియాల్సి ఉంది. మరి ఈ గాసిప్ కోసం లాక్ డౌన్ తర్వాతైనా ఛార్మీ ఎలా స్పందిస్తుందో చూద్దాం.




























