Connect with us

Featured

Chinmayi Sripadha : సమంతని అందుకే సపోర్ట్ చేస్తాను… సింగర్ కార్తీక్ ఎంతోమంది అమ్మాయిలను వేదించాడు… ఎన్టీఆర్ తెలియదు అంటే ట్రోల్ చేస్తారా : చిన్మయి శ్రీపాద

Published

on

Chinmayi Sripadha : ‘ఏ మాయచేసావే’ సినిమాతో సమంత కు డబ్బింగ్ చెప్పి ఇక ఆ సినిమాలో పాటలు పాడి తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది సింగర్ చిన్మయి శ్రీపాద. కేవలం గాయని గానే కాకుండా ఆర్జే గా అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కాకుండా సమాజంలో అమ్మాయిల మీద జరిగే లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ‘మీ టూ’ ఉద్యమకారిని గా కూడా పనిచేస్తున్న చిన్మయి ఇటీవలే తల్లయింది. ఇక తన ప్రెగ్నెన్సీ అలాగే డిలీవరి గురించి అత్యంత గోప్యంగా ఉంచి ప్రసవం తరువాత తనకు కవల పిల్లలు పుట్టినట్లు తెలిపారు చిన్మయి. ఇక తన కెరీర్ లో ఎదుర్కొన్న సవాళ్ళను అలాగే సమంత తో తన స్నేహం గురించి చెప్పారు.

సమంతను అందుకే సపోర్ట్ చేస్తా… ఎన్టీఆర్ తెలియదు అయితే…

ఏ మాయచేసావే సినిమా టైం నుండి సమంత సినిమాలన్నిటికీ చిన్మయి నే డబ్బింగ్ చెప్పింది. సమంతకు చినమ్మయి గొంతు చాలా చక్కగా సరిపోవడం వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగా వర్క్ అవుట్ అయింది. ఇక వాళ్లిద్దరూ మంచి స్నేహితులు కూడా అయ్యారు. చిన్మయి భర్త రాహుల్ ‘అందాల రాక్షసి’ హీరో కూడా సమంత కు మంచి మిత్రుడు, ఇలా ముగ్గురుకి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇక సమంత కు ప్రతి విషయంలో సపోర్ట్ గా ఉండే చిన్మయి సమంత ఎలా కష్టపడి కెరీర్ లో వచ్చిందో అలాగే ఒక మంచి హ్యూమన్ గా ఎలా ఎదిగిందో నాకు తెలిసు, సామ్ సహాయం చేసినపుడు అందరికి దేవత అదే సమంత ఒక సినిమాలో ఎక్సపోసింగ్ చేస్తే ట్రోల్ చేస్తారు, ఆమె చేసిన సహాయం అప్పుడే మర్చిపోతారా అంటూ చిన్మయి అభిప్రాయపడ్డారు.

Advertisement

ఇక తనను ఫెమినిస్ట్ అంటూ సోషల్ మీడియాలో బూతులతో మాట్లాడినా  నేను పట్టించుకోనని, అది వాళ్ల క్యారెక్టర్ ను చూపిస్తుంది అంతే అంటూ చెప్పారు. ఇక ఒక హీరోయిన్ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు అన్నందుకు ఆమెను ట్రోల్ల్స్ చేసారు అంత నెగెటివ్ ఎందుకు, మీకు ఇష్టమైన హీరో కాబట్టి ఒక ఎమోషన్ ఉంటుంది కానీ ఆమెకు ఆ హీరో తెలియాలని లేదు కదా. వదిలేస్తే పోయే విషయాన్ని ఎందుకు ఆమెను వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం అందుకే ఆ సమయంలో మీరచోప్రా కు నేను అండగా నిలబడ్డాను అంటూ చెప్పారు

కార్తీక్ విషయంలో జరిగింది అది…

సింగర్ కార్తీక్ తన తోటి లేడీ సింగిర్స్ ను లైంగిక వేధింపులకు గురించేసేవాడంటూ చిన్మయి ఆరోపించారు. 2018 టైములో ఇది బాగా సంచలనం సృష్టించింది. మీ టూ అంటూ ఈ వేధింపుల గురించి సోషల్ మీడియా ద్వారా ఇంకా ఎంతో మంది అమ్మాయిలు పంచుకోవడంతో కార్తీక్ మీద లైంగిక వేధింపుల కేసు కూడా పడింది. అయితే కార్తిక్ అవన్నీ ఆరోపణలని చెప్పారు. ఇక చిన్మయి ని ఈ విషయంలో చాలా మంది కామెంట్స్ కూడా చేసారు. ఇక సింగర్ మనో చిన్మయి కి ఫోన్ చేసి ఎందుకు కార్తిక్ విషయంలో ఇలా చేస్తున్నావ్ అని అడిగారు, అతను కస్టపది పైకి వచ్చాడు కదా అని చెప్పారు. అందరూ కెరీర్ లో కష్టపడే పైకి వస్తారు నేను కష్టపడి పైకి వచ్చాను, ఇలాంటి వివాధాల్లో ఇరుకున్నాను కదా. అయినా అతను సహచర లేడీ గాయనులను అవకాశాలు ఇప్పిస్తానని తనతో డేట్ చేయాలి, కమిట్మెంట్ ఇవ్వాలంటూ వేదిస్తున్నాడు ఇది మాకు తెలిసు అంటూ చెప్పారట. ఇక మనకు తెలిసిన వ్యక్తి అయితే తప్పు చేసినా చూసి చూడనట్లు వదిలేయకూడదు అంటూ చిన్మయి చెప్పారు.

Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!