కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం “ఆచార్య”. చిరు 152వ చిత్రం గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం యాభై శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆచార్య షూటింగ్ వాయిదాపండింది. కరోనా ప్రభావం తగ్గిన తరువాత మే మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ తరువాతి షెడ్యూల్ మొదలుకానుంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్నాడని ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వూలో చిరు స్పందించారు.

మొదటి నుండీ ఈ సినిమాలోని ఆ పాత్రకు కొరటాల చరణ్ నే అనుకున్నారని, మహేష్ ని అసలు అనుకోలేదని స్పష్టం చేసారు. అయితే ఆ పాత్ర కోసం రామ్ చరణ్ ను అనుకున్నామని కానీ చరణ్ ఇంకా డేట్స్ ఇవ్వలేదని చెప్పారు చిరంజీవి. చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ లో నటిస్తున్నందున ఆచార్య సినిమా కోసం చరణ్ డేట్స్ కావాలంటే రాజమౌళి ఒప్పుకోవాలి. ఈ విషయంపై రాజమౌళి, కొరటాల శివ ఇద్దరు కంప్రమైజ్ అయితేనే ఇది సాధ్యమవుతుందని తెలిపాడు. ఆచార్య సినిమాలో ఆ పాత్ర దాదాపు ఒక ముప్పే నిముషాలు ఉంటుందట. సినిమా రిలీజ్ అయ్యే వరకు లుక్ కూడా బయటకి వెళ్లనివ్వని రాజమౌళి ఇందుకు ఒప్పుకుంటాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే రాజమౌళి ఈ విషయంలో చరణ్ కి అనుమతి ఇవ్వకపోవచ్చనేది టాలీవుడ్ వర్గాల వాదన.

ఒక వేళ చరణ్ కాకపోతే ఆ స్థానంలో పవర్ స్టార్ పవన్ అయితే కరెక్ట్ గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. సోషల్ కాన్సెప్ట్ సినిమా, అన్న చిరంజీవి అడిగితె పవన్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటాడని అనుకుంటున్నారు. ఇదేగనుక జరిగితే పవన్ – చిరుల కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు పండగే..




























