ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ ముగించుకున్న “ఆచార్య” చిత్ర యూనిట్ తాజగా కొత్త షెడ్యూల్ బద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో ఆదివారం ప్రారంభమైంది. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ సారధ్యంలో కొన్ని పోరాట సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. దాదాపు 15 రోజుల పాటు అక్కడే షూటింగ్ జరపనున్నారు చిత్ర యూనిట్.

ఈ నేపధ్యంలో ఈ చిత్ర షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు పాల్గొన్న ఒక ఫోటో నేట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆచార్య చిత్రం మే 13 న విడుదల కానుంది.































