Connect with us

Featured

Choreographer Amma Rajashekhar : ప్రభాస్ ముఖం ఇప్పటికీ చూడలేదు… ఒక సాంగ్ కి 8 లక్షల రెమ్యూనరేషన్… నా కెరీర్ నాశనం అవడానికి కారణం అదే…: కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్

Published

on

Choreographer Amma Rajashekhar : డాన్స్ మాస్టర్ గా అడుగుపెట్టి దర్శకులుగా మారి సినిమాలు చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ప్రభుదేవా, లారెన్స్ మాస్టర్ ఇద్దరూ డైరెక్టర్లుగా సక్సెస్ అయ్యారు. అటు డాన్స్ కోరియోగ్రాఫర్లుగా మంచి స్టేజి లో ఉంటూనే ఇటు దర్శకులుగా హిట్లు కొడుతున్నారు. వీరి లాగానే డాన్స్ మాస్టర్ నుండి దర్శకుడిగా మారిన మరో వ్యక్తి అమ్మ రాజశేఖర్. డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు ఉన్న అమ్మ రాజశేఖర్ ఆ తరువాత దర్శకుడిగా మారాడు.

ప్రభాస్ ముఖం ఇప్పటికీ చూడలేదు…

తమిళ సినిమాలతో దర్శకుడిగా మారి సక్సెస్ అయ్యాడు అమ్మ రాజశేఖర్. ఇటు తెలుగులో గోపీచంద్ హీరోగా రణం సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇక ఆసినిమా హిట్ అవ్వడంతో ప్రభాస్ తో సినిమా చేయడానికి కథ సిద్ధం చేసుకున్నాడు. ప్రభాస్ నుండి పిలుపు రావడంతో కథ చెప్పడానికి వెళ్లాల్సి ఉండగా వేరే కారణాల వల్ల రెండు రోజులు లేట్ అయింది. ఇంక మళ్ళీ వెళితే ప్రభాస్ బిజీగా ఉన్నాడని కలవడం కుదరదని చెప్పడంతో నేను అక్కడే ఎదురుచూసి ఉండవచ్చు కానీ అదే సమయంలో నితిన్ ఫోన్ చేసి ఒక పాటకు డాన్స్ మాస్టర్ గా కావాలని అడిగాడు. ఇక ప్రభాస్ బిజీగా ఉన్నానని చెప్పించడం వల్ల నేను నితిన్ తో సినిమా చేయాలని అనుకున్నాను. అంతా ఓకే అనుకున్నాక కథ తేడా అనిపించి మారుద్దామని అనుకున్న సమయంలో మచ్చా రవి నా దగ్గర స్క్రిప్ట్ కి పనిచేసే వాడు అతను కథ వినిపించి ప్రొడ్యూసర్స్ తో ఓకే చేయించుకోవడంతో నాకు ఇగో హర్ట్ అయింది.

Advertisement

నితిన్ తో చేయాలని ఫిక్స్ అయి తమిళ డిజాస్టర్ మూవీని రీమేక్ చేయాల్సి వచ్చింది, అదే టక్కరి సినిమా. అది ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు. కానీ చేశా, దానివల్ల నా కెరీర్ నాశనం అయింది. ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసుంటే నా కెరీర్ బాగుండేది నితిన్ లాంటి హీరోతో చేయడం వల్ల ఇక ఆ సినిమా ప్లాప్ అవ్వడం వల్ల నా కెరీర్ పోయింది. ఇక నితిన్ కి అది మంచి సినిమానే అయినా కానీ నన్ను గుర్తుపెట్టుకోలేదు. అప్పుడు నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఇప్పుడు నా గురించి ఒక మాట కుడా మాట్లాడడు అంటూ కామెంట్స్ చేసారు. ఇక ఒకప్పుడు సినిమాల్లో డాన్స్ కంపోజ్ చేస్తే 5 లక్షలు తీసుకునే వారు కానీ నా కెరీర్ పీక్స్ లో నేను 8 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నాను. కానీ చెజేతులా నా కెరీర్ నేనే నాశనం చేసుకున్నాను అంటూ తెలిపారు.

Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!