సినీతారలు ఎందుకు బలవన్మరణానికి పాల్పడుతున్నారు? జీవితాన్నే పణంగా పెట్టి సూసైడ్ లాంటి తీవ్ర నిర్ణయాలను తీసుకోవడానికి ప్రేరేపిస్తున్న పరిస్థితులేమిటి? చిత్ర సీమలో వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయి? కొందరు దర్శకులు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ఎలా చేస్తున్నారు? బలవాన్మరణంకు తెలియని కారణాలు ఎన్నో ఉంటాయి.
సినిమా అవకాశాలు లేకపోవడం వల్లే సూసైడ్ చేసుకుంటారనే భావన వుంది. అదొక్కటే నిజం కాదు. ఆత్మాభిమానం భగ్నం కావడం, నమ్మిన విలువలు నమ్మినట్లుండకుండా నయవంచనకు గురి కావడం, మనశ్శాంతి కోల్పోవడం..ఈ కారణాలన్నీ ప్రాణాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తున్నాయి. సినిమా రంగంలో ఈ విధంగా ప్రాణాలు తీసుకున్న తారల జీవితాలను పరిశీలిస్తే.. టాలీవుడ్ అతిలోక సుందరి హఠాన్మరణం అందరినీ కలచివేసింది. వెండితెరపై అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న శ్రీదేవి మరణ వార్త యావత్తు భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. శ్రీదేవి కన్నా ముందు.. శ్రీదేవి మరణం తర్వాత కూడా నిన్నటి బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ వరకూ వెండితెరపై తమ అందచందాలతో, నటనతో ఆకట్టుకున్న ఎంతోమంది హీరోయిన్లు చిన్న వయస్సులోనే తనువు చాలించిన విషాద సంఘటనలున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన గురు దత్ మరణం కూడా అనుమానాస్పదమే. నిద్ర మాత్రలను ఎక్కువగా వేసుకోవడంతో పాటు ఆల్కహాల్ సేవించడం వలనే 1964, అక్టోబర్ 10న ఈయన మరణించాడు. కానీ అయితే అది కావాలని జరిగిందా.. లేక బలవాన్మరణమా అనేది మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు.
బాలీవుడ్లో ఫిమేల్ గురుదత్గా పేరు తెచ్చుకున్న మీనాకుమారి కూడా తీవ్ర అనారోగ్యంతో 38 ఏళ్ల వయస్సులోనే మృతి చెందిందని తేల్చేశారు. కానీ ఇమె మరణం కూడా హిస్టరీ లో ఓ మిస్టరీగానే వుంది.
బాలీవుడ్ మార్లిన్ మన్రో ఎవరంటే ఇప్పటికీ పర్వీన్ బాబీ పేరు చెబుతారంటే అతిశయోక్తి కాదు. అమర్ అక్బర్ ఆంటోని, దీవార్, క్రాంతి, షాన్ వంటి సినిమాల్లో పర్వీన్ నటనకు వీక్షకులు ఫిదా అయ్యారు. కొన్నాళ్లు మానసిక సమస్యలతో ఇబ్బంది పడిన ఆమె 55 ఏళ్ల వయస్సులోనే సూసైడ్ చేసుకుంది. జనవరి 20, 2005న తన ఇంట్లోనే అనుమానాస్పదంగా చని పోయింది. 3 రోజుల తర్వాత ఆమె శవాన్ని చూసారు. ఇప్పటికీ ఈమె మరణంపై స్పష్టత రాలేదు.
బాలీవుడ్ మోడల్ నసీఫా జోసెఫ్ మరణం కూడా నేటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె సూసైడ్ చేసుకోవడం వెనుక కారణం కాబోయే భర్త అని రూమర్స్ వచ్చాయి. కానీ క్లారిటీ మాత్రం రాలేదు.
టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవికి తన 8వ ఏటనే ప్రాణాపాయం తప్పింది. శోభన్బాబు ”నా తమ్ముడు” సినిమాలో ఒక సీన్ను తీస్తున్నారు. శ్రీదేవి పరిగెత్తుకుంటూ రోడ్డు దాటే సీన్ చేయాల్సింది. ఆ చిత్ర దర్శకుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తండ్రి Ks ప్రకాశరావు అయినప్పటికీ ఆ సీన్ను రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. అప్పటికి యువకుడైన రాఘవేంద్ర రావు.. ఇంగ్లీష్ సినిమాల ప్రభావంతో సీన్ సహజంగా రావాలని.. శ్రీదేవిని మద్రాస్ మౌంట్రోడ్ లో నిజంగానే ట్రాఫిక్ లో పరిగెత్తమన్నారు. తాను చేతి రుమాలు ఊపగానే పరుగెత్తుకుంటూ రావాలని సూచించారు. చిన్నపిల్ల కావడంతో అందులో ప్రమాదాన్ని ఆలోచించని శ్రీదేవి.. ఆయన కర్చీఫ్ ఊపగానే రోడ్డుకు అడ్డంగా పరిగెత్తేశారు. కన్నుమూసి తెరిచేలోపు.. ఒక కారు ఆమె కాలిని తాకి వెళ్లి పోయింది. శ్రీదేవి కింద పడిపోయింది. అదృష్టవ శాత్తూ దెబ్బలు తగల్లేదు. ఆ సంఘటన జరిగిన తర్వాత రాఘవేంద్ర రావుతో 24 సినిమాలు చేసింది. అలా భారతీయ స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్లోని ఓ పెళ్లికి తన ఫ్యామిలీ మెంబర్స్ తో హాజరై అక్కడే హఠాత్తుగా కన్నుమూసింది. గుండెపోటు నుంచి మొదలై శ్రీదేవి మరణానికి చాలా కారణాలు చెప్పారు. కానీ అసలు కారణం మాత్రం బయటికి రాలేదు. ఆమె మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలి పోయింది.
ఒకానొక టైంలో దివంగత దివ్యభారతిని శ్రీదేవితో పోల్చారు. శ్రీదేవితో తనను పోల్చడం థ్రిల్ కలిగించిందని ఓ ఇంటర్వ్యూలో దివ్య భారతియే స్వయంగా చెప్పారు. ఆమె గొప్ప అందగత్తె అని కొనియాడారు. ఈమె టీనేజ్ వయస్సులోనే బాలీవుడ్, టాలీవుడ్లను షేక్ చేసింది. అయితే ఏప్రిల్ 5, 1993న ముంబై లోని తన అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కింద పడి చనిపోయింది. అప్పటికి ఆమె వయస్సు 19 ఏళ్లు. దివ్యను హత్య చేసారని కొందరంటున్నారు.. మరికొందరు మాత్రం ప్రమాదవశాత్తూ చనిపోయిందంటారు. సో.. బాలీవుడ్ నే షేక్ చేసిన దివ్యభారతి మరణం వెనుక రహస్యం ఇప్పటికీ వెలుగులోకి రాలేదు.
టాలీవుడ్ లో వాంప్ క్యారెక్టర్స్ కీ.. ఐటం సాంగ్స్ కీ ఆరోజుల్లోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న శృంగార తార సిల్క్ స్మిత 1996, డిసెంబర్ 23న చెన్నైలోని తన సొంతింట్లోనే చనిపోయింది. ఈమె మరణానికి సినిమా కెరీర్ సమస్యలతో పాటు కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా కారణమయ్యాయని టాలీవుడ్ టాక్. కానీ కొందరు మాత్రం సిల్క్ మరణంపై అనుమానాలు కూడా వ్యక్తం చేసారు.
హిందీతోపాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించిన సౌందర్య కూడా అందం, అభినయంతో తెలుగు వారికి దగ్గరైంది. అయితే 32 ఏళ్ల వయస్సులో 2004లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య ప్రాణాలు కోల్పోయారని వార్తలొచ్చాయి. కానీ సౌందర్య మరణం వెనుక వేరే కారణాలున్నట్లుగా అప్పట్లో సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.
పదహారేళ్లకే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆర్తీ అగర్వాల్ తెలుగులో చాలా హిట్ చిత్రాల్లో నటించింది. బేరియాట్రిక్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లి.. శస్త్ర చికిత్స జరుగుతుండగా… గుండె ఆగి పోవడంతో 31ఏళ్ల వయస్సులోనే మృతి చెందినట్లు ఆర్తీ అగర్వాల్ ఫ్యామిలీ నిర్ధారించింది కానీ ఆమె మరణం కూడా ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.
తెలుగు చిత్రాలతో పాటు తమిళ, మలయాళ చిత్రాలలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న తెలుగమ్మాయి ప్రత్యూష ఫిబ్రవరి 23, 2002న చనిపోయింది. ఈమె మరణం ఇప్పటికీ మన టాలీవుడ్ హిస్టరీలో ఓ మిస్టరీనే.
నిశ్శబ్ధ్, గజిని, హౌజ్ ఫుల్ లాంటి సినిమాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ జియా ఖాన్ 2013, జూన్ 3న తన ఇంట్లోనే చనిపోయింది. అయితే ఈమె మరణం వెనక బాలీవుడ్ హీరో సూరజ్ పంచోలీ హస్తం వుందంటూ జియాఖాన్ తల్లి ఆరోపించడం విశేషం.
ప్రియా రాజవంశ్.. మార్చి 27, 2000న మరణించిన ఈమె మరణంపై క్లారిటీ లేకపోయినా ఆ తర్వాత ఆమె భర్తే చంపేసాడని దర్యాప్తులో తేలింది.
హాలీవుడ్ శృంగార దేవత మార్లిన్ మన్రో 1962లో మరణించింది. ఆమె మరణానికి ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. మార్లిన్ మన్రో ది అంటున్నా కూడా చాలామంది ఈమెది హత్యే అనే స్ట్రాంగ్ గా వాదించే వాళ్ళున్నారు.
1973, జులై 20న మరణించిన సెన్సేషనల్ హీరో బ్రూస్లీ మరణం కూడా ఇప్పటికీ మిస్టరీనే. ఈయన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేసారు అని ఇప్పటికీ ప్రచారం జరుగుతుంది.
జూన్ 14, 2020న బాలీవుడ్ హీరో సుశాంత్ సూసైడ్ చేసుకుని 4 నెలలవుతున్నా ఇప్పటికీ ఈయన మరణం వెనుక దాగివున్న రహస్యాలు బయటికి రాలేదు.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.