Connect with us

Featured

Relations in Film Industry : సినిమా పరిశ్రమలో మామ అల్లుళ్లు అయినవాళ్ళు వీరే..!

Published

on

Relations in Film Industry : సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన, కొనసాగుతున్న ప్రముఖ, దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు తమ జీవిత భాగస్వాములను సినీ ఇండస్ట్రీలోనే దొరకపుచ్చుకున్నారు.

వీళ్ళు వివాహం చేసుకోవడంతో భారతీయ సినీ పరిశ్రమ లో చాలామంది ప్రముఖ నటులు మామ అల్లుళ్ళు అయ్యారు. ఈ విధంగా మామా అల్లుళ్లు అయిన వారెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

అల్లు రామలింగయ్య కూతురు అయిన సురేఖ ని వివాహం చేసుకొని అతనికి అల్లుడు అయ్యాడు చిరంజీవి. వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు.

2004 నవంబర్ 18వ తేదీన రజనీకాంత్ పెద్ద కూతురు అయిన ఐశ్వర్యాని ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. దంపతులిద్దరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. దీంతో తమిళ స్టార్ హీరో అయిన రజనీకాంత్ ధనుష్ మామ అల్లుళ్లు అయ్యారు. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. మళ్ళీ కలుస్తున్నారంటూ వార్తలు కుడా వస్తున్నాయి..

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన కళ్యాణ్ దేవ్ ని 2016 మార్చి 28 వ తేదీన పెళ్లి చేసుకుంది. దీంతో కళ్యాణ్ దేవ్ చిరంజీవి మామా అల్లుళ్లు అయ్యారు. కళ్యాణ్ కూడా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి.. కానీ దీనిపై అటు శ్రీజ గానీ ఇటు కళ్యాణ్ దేవ్ కానీ స్పందించలేదు.

ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కూతురు ప్రియాంక.. నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా డైరెక్టర్ నాగ అశ్విన్ ని ప్రేమించి 2015వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. దీంతో అశ్వినీదత్, నాగ అశ్విన్ మామ అల్లుళ్ళయ్యారు.

ప్రముఖ తమిళ, మలయాళం హీరో, నిర్మాత అయిన సీఎల్ ఆనందన్ కుమార్తె డిస్కో శాంతి తొమ్మిది వందల సినిమాల్లో ఐటమ్ సాంగ్ ల లో నాట్యం చేసి భారతదేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అయితే ఈ డిస్కో శాంతిని శ్రీహరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో సీఎల్ ఆనందన్ శ్రీహరి మామ అల్లుళ్ళయ్యారు.

1988వ సంవత్సరంలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రముఖ నిర్మాత అయిన కే. బాలాజీ కుమార్తె సుచిత్ర ని పెళ్లి చేసుకున్నాడు. సుచిత్ర కూడా తన తండ్రి లాగానే భారతీయ సినిమా నిర్మాత. ఈమె వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటుంది.

రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ కి తల్లిగా నటించిన శరణ్య భారతీయ నటుడైనా పోంవన్నన్ ని పెళ్లి చేసుకుంది. శరణ్య మలయాళ సినిమా దర్శకుడైన ఏ.భాస్కర్ రాజు కుమార్తె కాగా… పోంవన్నన్ భాస్కర్ రాజు మామ అల్లుళ్లు అయ్యారు.

సీఎల్ ఆనందన్ పెద్ద కుమార్తె అయిన లలిత కుమారి ని ప్రకాష్ రాజు 1994వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని 2009వ సంవత్సరంలో విడాకులు ఇచ్చాడు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో సీఎల్ ఆనందన్ కి శ్రీ హరి తో (భార్య రెండవ కుమార్తె డిస్కోశాంతి) పాటు ప్రకాష్ రాజ్ కూడా అల్లుడు అయ్యాడు.

సీనియర్ హీరోయిన్ నిరోషా రాధా రాంకీ కి పిలవబడే రామకృష్ణన్ ని 1995వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. నిరోషా రాధా ప్రముఖ నటుడు రాజకీయవేత్త అయిన మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ కుమార్తె కాగా… అతడికి రాంకీ అల్లుడు అయ్యాడు. మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ కి సీనియర్ నటీమణి రాధిక కూడా కూతురే. అయితే రాధిక శరత్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. దీంతో శరత్ కుమార్ కూడా మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ అల్లుడు అయ్యాడు.

2001వ సంవత్సరంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నా ని పెళ్లి చేసుకున్నాడు. ట్వింకిల్ ఖన్నా రాజేష్ కన్నా కుమార్తె కాగా… అతడికి అక్షయ్ కుమార్ అల్లుడు అయ్యాడు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!