గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ కరోనాతో పోరాడుతున్నారు. కరోనా వైరస్ బారిన పడటంతో ఆయన ఆగస్టు 5న చెన్నైలోని MGM హాస్పిటల్ లో చేరారు. ముందు జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలు కనిపించినప్పటికీ, ఆగస్టు 13వ తేదీన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆ రోజు నుంచి ఆయనకు వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తాజాగా ఆయనకు వెంటిలేటర్ ను తొలగించి ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్ సపోర్ట్ తో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్లుగా తెలియడటంతో సినిమా రంగమంతా కలత చెందుతోంది. ఈ నేపథ్యంలో ఎస్.పీ బాల సుబ్రహ్మణ్యం గారు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటూ సినీరంగ ప్రముఖులు, బాలు ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు.
తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వీలైనంత త్వరగా కోలుకొని సంగీతాభిమానులందరినీ అలరించాలని కోరుకుంటూ ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తూ.. ఆయనతో తనకున్న మైత్రిని ఈ సందర్భంగా జ్ణాపకం చేసుకుంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
”బాల సుబ్రహ్మణ్యం, నేనూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను బాలు అని పిలిస్తే.. ఆయన నన్ను శిశుపాల, భక్త అని సరదాగా పిలిచే వారు. షూటింగ్ లలో.. ఆడియో ఫంక్షన్లలో కలుసుకున్నప్పుడు మాత్రం మోహన్ బాబు అని పిలిచేవారు. నా బాల్యం నుంచే.. అంటే కాళహస్తిలో వున్నప్పుడు నేను బడికి వెళ్ళే రోజుల్లోనే మా ఇద్దరి మధ్యా మంచి స్నేహబంధం ఉంది. సాధారణంగా గాయకులెక్కువగా సినీ ల్యాబ్ లోకి రాగానే ముందుగా డబ్బు తీసుకుంటూ వుంటారు. ఎన్నో చిత్రాలకు బాలుతో కలిసి పని చేశాను. కానీ ఆయన ఏనాడూ నా దగ్గర డబ్బు తీసుకోలేదు. ఆ విషయానికి వస్తే.. ఒకసారి నేనే భోజనానికి డబ్బుల్లేక బాల సుబ్రహ్మణ్యం దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకున్నాను. ఆ అప్పు ఇప్పటికింకా తీర్చనేలేదు. అందుకే అప్పుడప్పుడూ బాలు ‘ఏమయ్యా.! అప్పడెప్పుడో నా దగ్గర అప్పుగా తీసుకున్న ఆ వంద రూపాయలు ఇంకా ఇవ్వనేలేదు. ఇప్పటికి ఆ వంద వడ్డీతో సహా కోటి రూపాయిలై ఉంటుందంటావా.?’ అని సరదాగా ఆట పట్టించే వారు.
ఏ స్వరాభిషేకంతో ఆ సంగీత సరస్వతికి ముద్దుబిడ్డగా జన్మించాడో ఆ గాన గంధర్వుడైన మా బాలు అదే గొంతుతో మళ్ళీ సర్వ దేవతల సంకీర్తనలను పాడాలి. వాళ్ళందరి ఆశీస్సులతో ఆరోగ్యంగా కోలుకోవాలి. మళ్ళీ మనందరి మధ్యకొచ్చి మంచి మంచి పాటలను ఆలపించాలని అందరం కోరుకుందాం” అని భావోద్వేగంతో మోహన్ బాబు ఇంటర్వ్యూను ముగించారు. ఇదిలా వుండగా.. ప్రస్తుతం ICUలో చికిత్స పొందుతున్న SP బాల సుబ్రహ్మణ్యంకు తను పాడిన పాటలని వినిపిస్తున్నారని తెలిసింది. బాలు త్వరగా కోలుకోవాలని ఆయన ఉన్న వార్డులో పాటల్ని ఆడియో ద్వారా ప్రసారం చేస్తున్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారు.
బాలు త్వరగా కోలుకొని బయటకు రావాలంటూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు.. సినీ ప్రముఖులు సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, కె.రాఘవేంద్ర రావు, ఇళయరాజాలతో పాటు పలువురు రాజకీయ, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కోరుకుంటున్నారు. లేటెస్టుగా Sp.బాల సుబ్రహ్మణ్యం కుమారుడు Sp చరణ్.. నిన్న తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని మీడియాకి తెలియజేస్తూ.. మనోవేదనకు గురవుతూ.. ‘‘మీ ప్రార్థనలు వృథాగా పోవు. దేవుడు ఉన్నాడు. నాన్న ఆరోగ్యంతో తిరిగి వస్తారని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను’’ అంటూ వణుకుతున్న గొంతుతో చరణ్ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.