జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచాడంటూ సోమవారం తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో హైపర్ ఆది తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పితీరాల్సిందే అంటూ తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచే విధంగా హైపర్ ఆది మాట్లాడారని ఆరోపించింది.

ఈ నేపధ్యంలో హైపర్ ఆది ఈ వార్తలపై స్పందించాడు.. హైపర్ ఆది మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రజలను కించపరచలేదు. అసలు ఆ స్క్రిప్ట్ రాసింది నేను కాదు. అక్కడ నేను కేవలం ఆర్టిస్ట్ను మాత్రమే అని తెలిపారు. టీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచే విధంగా మాట్లాడారని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ఆరోపించింది. ఈ మేరకు ఆది, స్క్రిప్ట్ రైటర్తో పాటు మల్లెమాల ప్రొడక్షన్పై చర్యలు తీసుకోవాలని ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డికి ఫిర్యాదు చేశారు.



























