మాజీ ఎస్వీబీసీ చైర్మన్, వైసీపీ నేత, టాలీవుడ్ కమిడియన్ పృద్విరాజ్… ఎస్వీబిసి మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా మాట్లాడినట్టు వచ్చిన టేపులు అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద రచ్చే జరిగింది. అయితే తాజాగా తనపై వచ్చిన అభియోగాలపై పృథ్వి ఘాటుగా స్పందించారు. తాను ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో మాట్లాడినట్టు బటయకు వచ్చిన టేప్ తో ఏకంగా అయన ఎస్వీబీసీ చైర్మన్ పదవిని కోల్పోవాల్సివచ్చింది. ఈ ఘటన జరిగిన చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న పృథ్వి తాజగా మీడియాతో తన బాధను పంచుకున్నారు.

పదవి కోల్పోయిన తరువాత తాజగా తిరుమలకు కాలినడకన వెళ్ళీ ఆ ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు. అయితే ఆ సమయంలో అయన కొన్ని సంచలన వ్యాఖలు చేసారు. తనను కుట్రపూరితంగా ఎస్వీబిసి నుంచి తరిమేశారని ఆయన అన్నారు.. కాంట్రాక్ట్ పద్దతి ఉన్న ఉద్యోగులను రెగ్యురలైజ్ చేస్తానని హామీ ఇచ్చానని అందువల్లే తనను బయటకు పంపించేందుకు కుట్ర చేసారని వ్యాఖ్యానించారు పృథ్వి. నన్ను బయటకు గెంటేసి వారు మాత్రం పైశాచికానందాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలతో తాను చాలా మానసిక ఆందోళనకు గురయ్యారని చెప్పారు. తన పదవి పోవడానికి కారణం అయినా వారిని ఊరికే వదిలిపెట్టను.. త్వరలో అన్ని నిజాలు బయటపెడతానని వ్యాఖ్యానించారు. తాను ఎప్పటికి ముఖ్యమంత్రి జగన్ కు జవాబుదారిగా ఉంటానని తెలిపారు.

రాజధాని రైతులపై “పెయిడ్ ఆర్టిస్టులంటూ” తాను చేసానని వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు. రాజధాని రైతులను తాను ఎప్పుడు కించపరిచేలా వ్యాఖ్యానించలేదని మరోసారి చెప్పారు. రైతులంటే తనకు అపారమైన గౌరవం ఉందని తెలిపారు.
అయితే ప్రాణం ఉన్నంత వరకు వైసిపిలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు కమిడియన్ పృథ్వి.

































