Comedian Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి మాట్లాడారు.

పవన్ ను ఆ ఒక్క విషయంపైనే విమర్శలు…
వైసీపీ నుండి బయటకు వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. అయితే ఆయన మీద ఆరోపణల్లో నిజం లేదంటూ చెబుతున్న పృథ్వీ గారు, కనీసం ఆ ఆరోపణలు నా మీద వచ్చినపుడు పార్టీ అధినేతగా నన్ను పిలిచి అసలు జరిగింది ఏమిటి అని ఒక మాట అడగలేదు. జగన్ కనీసం పిలిచి ఒకసారి మాట్లాడినా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు అంటూ చెబుతూ కొంతమంది ఎంపీల మీద అలాంటి ఆరోపణలు వచ్చాయి. అంతేకాక పార్లమెంట్ లో కూడా వాటిపైన చర్చ జరిగింది కదా అలాంటి వాళ్ల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ మాట్లాడారు.

ఇక మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్న వాసి రెడ్డి పద్మ, మంత్రి రోజా ఇలాంటి వాళ్లంతా అప్పుడు ఏమయ్యారు. అలాంటి వీడియోలు బయటికి వచ్చినా వాళ్ళను ఏం అనరా అంటూ మాట్లాడారు. ఇక పవన కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి తప్ప వాళ్ళ దగ్గర పవన్ ను విమర్శించడానికి మరో సాకు లేదని రెండు పెళ్లిళ్లు రెండు చోట్ల ఓడిపోయాడు అంటూ మాట్లాడటమే తప్పు వేరే స్క్రిప్ట్ వాళ్ళ దగ్గర ఉండదు అంటూ విమర్శించారు. ఇక చాలా మంది టీటీడీ ఉద్యోగులే జగన్ ప్రభుత్వం మీద విసిగిపోయి ఉన్నారని, తొందర్లోనే ఈ దరిద్రం దిగిపోతుందని భావిస్తున్నారు. ప్రజలూ అలానే అనుకుంటున్నారు అంటూ అభిప్రాయపడ్డారు.





























