ఏపీలో సమగ్ర భూ సర్వేపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. జూన్ 2023 నాటికి సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన సిబ్బందిని, పరికరాలను సిద్ధం చేయాలని సూచించారు.

కాగా భూ సర్వేలో అత్యున్నత సాంకేతిక ను ఉపయోగించుకోవాలన్నారు సీఎం జగన్. ఈ సర్వే త్వరితగతిన పూర్తిచేయడానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి 4 వారాలకు ఒకసారి సమగ్ర సర్వేపై సమీక్షిస్తానని స్పష్టం చేశారు.



































