ప్రపంచ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంది. మనదేశంలో కూడా ఈ కరోనా బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 3577 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 427 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 83కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. మొదట్లో కేసుల సంఖ్య కొంచెం తక్కువ అనిపించినా ఢిల్లీ నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారి లింకులు బయటపడటంతో గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదివారం నాటికి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 252గా నమోదయింది. అయితే ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రమే 52 కరోనా కేసులు నమోదు అవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

కర్నూలు జిల్లాను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రెండు రోజుల పాటు నిత్యావసరాలు సైతం బంద్ చేయనున్నారు. కర్నూలు జిల్లా కేంద్రంతో పాటుగా నంద్యాల, నందికొట్కూరు, గడివేముల, ఆత్మకూరు, కోడుమూరు, బనగానేపల్లె, పాణ్యం, అవుకు పట్టణాలను కంటోన్మెంట్ జోన్లుగా పరకటించారు.




























