దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకి ఈ మహమ్మారి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంది. ఈ లాక్ డౌన్ మరికాస్త పెంచే యోచనలో ఉంది కేంద్రం. ఇప్పటికే ఈ మహమ్మారి నివారణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఒక వైపు ప్రజలెవరూ రోడ్ల పైకి రావొద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నారు. చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి తీరు మాత్రం తీవ్ర వివాదాస్పదంగా మారింది. కరోనా వైరస్ నివారణ కోసం విరాళాలు ఇచ్చిన వారి ఫోటోలు ట్రాక్టర్లపై పెట్టి భారీ ర్యాలీ చేసారు. దాదాపు 1000 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నట్టు సమాచారం. అయితే వీరిలో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ర్యాలీ సమయంలో అక్కడి స్థానికులకు నిత్యావసర వస్తువులు అందించారు ఎమ్మెల్యే.

జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో భాద్యతగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఇలా జనాలను సమీకరించి ఇలా భారీ ర్యాలీలు తీయడం సరికాదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. సాయం చేసిన వారికీ కృతజ్ఞతలు తెలపడం తప్పులేదు కానీ..ఇటువంటి విపత్కర సమయంలో భారీ ర్యాలీ వంటి కార్యక్రమాలు చేయడం సరికాదని అంటున్నారు స్థానికులు. ఇప్పటికే పలు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే.





























