అసలే రోజు రోజుకీ రెట్టింపవుతున్న కరోనా రోగుల సంఖ్యతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో భయాందోనళలు నెలకొన్న నేపథ్యంలో కొందరు ఐసోలేషన్ నుంచి తప్పించుకుంటూ ప్రభుత్వానికి, పోలీసులకు మరింత తలనొప్పిగా మారుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ గాంధీ ఆసుపత్రి నుంచి పరారయ్యాడు ఒక కరోనా రోగి. గద్వాల్ కు చెందిన ఈ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి వారం రోజుల నుంచి చికిత్సను అందిస్తున్నారు

నిన్న రాత్రి గాంధీ ఆసుపత్రి సిబ్బంది కళ్ళుగప్పి ఐసోలేషన్ వార్డు నుంచి పరారయ్యాడు. అక్కడి వైద్య సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తప్పించుకున్న ఈ వ్యక్తి నుంచి మరింత మందికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది.. ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా ఇతనికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఐసోలేషన్ వార్డు నుంచి ఎలా తప్పించుకున్నాడు ? అక్కడి నుంచి ఎక్కడకు వెళ్ళాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడు బయట తిరిగితే అతనితో పాటు ఇతరులకు ప్రాణాపాయం ఉండటంతో పోలీసులు తీవ్రంగా గాల్సిటున్నట్టు సమాచారం.




























