ప్రస్తుతమున్న పరిస్థితులలో కరోనా వైరస్ బారిన పడితే కచ్చితంగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా కరోనా రోగులను మూడు రకాలుగా విభజిస్తారు. స్వల్ప లక్షణాలు, మధ్యస్థ లక్షణాలు, తీవ్రమైన లక్షణాలు ఉన్న వారిగా కరోనా రోగులను విభజిస్తారు.అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వారందరికీ ఒకే రకమైన మందులను ఉపయోగించి వైద్యం చేయరు.వారిలో వ్యాధి లక్షణాలు వ్యాధి తీవ్రతను బట్టి వారికి చికిత్స అందించడం జరుగుతుంది.
కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉంటే వారు ఆస్పత్రిలో చేరాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఉంటూ తరుచూ ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవాలి. ఏదైనా అవసరమైతే ఆన్లైన్ విధానం ద్వారా వైద్యుల సలహాలు తీసుకోవాలి. అదేవిధంగా స్వల్ప లక్షణాలు ఉన్నవారికి మల్టీవిటమిన్ మాత్రలను వేసుకోవడం ద్వారా వ్యాధిలక్షణాలు పూర్తిగా తొలగిపోతాయి.
కరోనా లక్షణాలు కొంతవరకు మధ్యస్తంగా ఉంటే అటువంటి వారు, ఆక్సిజన్ 90 నుంచి 94 మధ్య,
సీటీ స్కాన్ స్కోరింగ్ 10-20 మధ్య ఉన్నవారు, నడిచినా ఆయాసం ఉన్నవారిని మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి భావిస్తారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా ఆసుపత్రిలో చేరాలి. వీరికి అవసరమైతే ఆక్సిజన్ అందిస్తూ రక్తాన్ని పలుచగా చేసే మందులను ఇస్తారు. అవసరమైతే వీరికి రెమ్డిసివిర్ ఇస్తారు.
మూడవ వర్గానికి చెందిన వారు తప్పనిసరిగా ఆస్పత్రిలో ఉంటూ చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా ఈ తరహా లక్షణాలు ఉన్నవారికి వెంటిలేటర్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. పై తెలిపిన మందులతోపాటు వీరికి ఇమ్యునో మాడ్యులేటర్స్ మందులు కూడా ఇస్తాం. కొన్ని ప్రత్యేక కేసుల్లో తొసిలిజుమాబ్, ఇటోలిజుమాబ్ ఇస్తాము. అవసరమైతే సైటో సార్బ్ డయాలసిస్ చేస్తారు. ఈ విధంగా పరిస్థితులను బట్టి రోగికి ఉన్న వ్యాధి లక్షణాల తీవ్రతను బట్టి వారికి మందులను ఇస్తూ వైద్యం చేస్తారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…