దేశంలో కరోనా కేసులు సంఖ్య స్వల్ఫంగా పెరుగుతున్నాయి. తాజాగా 16,40,287 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 44,643 మంది కరోనా సోకినట్లు తేలింది. దేశవ్యాప్తంగా మరో 464 మంది మరణించారు. ఇక రాష్ట్రాలవారిగా చూస్తే కేరళ, మహారాష్ట్రలో కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. మొత్తం కేసులు సంఖ్య 3.18 కోట్లకు చేరుకొగా… 4.26లక్షల మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.

ప్రస్తుతం దేశంలో 4,14,159 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మెుత్తం కేసుల వృద్ది రేటు 1.30 ఉండగా.. రికవరీ రేటు 97.36 శాతంగా ఉంది. గురువారం వరకు 41వేల మంది కరోనాను జయించారు. దీంతో ప్రస్తుతం కరోనా నుంచి కొలుకున్న వారి సంఖ్య 3.10 కోట్లకు చేరింది. వైద్య ఆరోగ్య శాఖ టీకాలు పంపిణి వేగంగా జరుగేలా ప్రయత్నిస్తోంది. గురువారం 57.97లక్షల మంది టీకాలు వేయించారు. ఇప్పటివరకు మెుత్తం డోసుల వెయించుకున్న వారి సంఖ్య 49.5 కోట్ల మార్కును దాటింది.































