మనం చెప్పుకునే కూరగాయల్లో దోసకాయ కూడా ఒకటి. మన ప్రాచీన కాలం నుంచి దీనిని అంతర పంటగాను.. మరియు ప్రత్యేకంగా పొలంలో కూడా దీనిని పండిస్తున్నారు. ఈ దోసకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పుచ్చకాయలో ఎలా అయితే నీటి శాతం ఎక్కువగా ఉంటుందో.. దోసకాయలో కూడా ఉంటుంది. అధిక నీటి శాతం ఉండటం శరీరానికి మంచిదే.
అయితే దీని ద్వారా దోసకాయ పానీయం ఎలా తయారు చేస్తారు.. దీని వల్ల ఉపయోగం ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.. మన దేశీయంగా తయారైనా దోసకాయను కడిగి ముక్కలుగా చేసి.. రాత్రి ఒక గ్లాసులో వేయాలి. అలాచేసిన తర్వాత నీటితో నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం తాగితే శరీరంలోని విష పదార్ధాలు విసర్జింప బడతాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఎముకలు గట్టిగా తయారు అవుతాయి. గాయాలు ఏర్పడినప్పుడు అక్కడ రక్తం గడ్డకట్టకుండా ఉపయోగపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు దోసకాయలో కుకుర్బిటాసిన్స్ అనే కాంపౌండ్స్ మరియు లిగ్నాన్స్ అనే న్యూట్రియెంట్స్ సమూహం కలిగి ఉన్నాయి. ఇవన్నీ క్యాన్సర్ ను ఎదుర్కొనేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆహారంలో ఉప్పుని ఎక్కువగా తీసకుంటే.. అధిక రక్తపోటు సమస్య వేధిస్తుంది. శరీరంలోని అదనపు ఉప్పు అనేది ద్రవాలను కలిగి ఉంటుంది.
తద్వారా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. దోసకాయలోని పొటాషియం అనేది ఎలెక్ట్రోలైట్ గా పనిచేసి కిడ్నీలలో స్థాయిలను నియంత్రిస్తుంది. మెటబాలిజం మెరుగుపడటంతో పాటు అప్పెటైట్ అనేది నియంత్రించబడుతుంది. మూత్రపిండాల సమస్యలను దోసకాయ నీటితో దూరంగా ఉంచవచ్చు. బీపీ స్థాయిని కూడా నియంత్రిస్తుంది. ఇంకా ఈ దోసకాయ వాటర్ ద్వారా మరెన్నో ప్రాణాంతకమైన వ్యాధులు దరి చేరకుండా కాపాడుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…