Damu Balaji : సమంత నాగచైతన్య విడిపోయి చాలా కాలం అయిపోయి ఎవరికి వారు వాళ్ళ కెరీర్లో బిజీగా ఉన్నా వాళ్ళ విడాకుల గురించి ఏదో ఒక వార్త రోజు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది. తాజాగా సమంత ను నాగచైతన్య బాగా టార్చర్ చేసాడని అందుకే సమంత భరించలేక అబార్షన్ కూడా చేయించుకుందంటూ సినిమా రివ్యూ ఇచ్చే ఉమర్ సందు తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టడంతో మరోసారి వీళ్ళ విడాకులు గురించి చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ గోలలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. అదే సమంత నాగచైతన్య విడిపోడానికి కారణం జగ్గి వాసుదేవ్ బాబా అని. ఆయన సమంత సన్యాసం వైపు అడుగులు వేసేలా ప్రభావితం చేశాడంటూ కొంతమంది తమిళ వాసులు ఆరోపించారు. ఇక ఈ ఇష్యూ మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

జగ్గీ వాసుదేవ్ మరో నిత్యానంద…
జగ్గీ వాసుదేవ గురించి దాము బాలాజీ మాట్లాడితూ ఆయన మొదటి నుండి ఆధ్యాత్మికత వైపు లేడని ఆయన చిన్నతనం నుండి జీవితం గురించి తెలిస్తే ఆయన ఎంత బిజినెస్ మైండెడ్ అనేది తెలుస్తుందని తెలిపారు. మొదట కోళ్ల ఫారం లాంటి రకరకాల వ్యాపారాలు చేసిన అతను యోగా నేర్చుకుని ఆయన గురువు సలహా మేరకు కోయంబత్తూరు లో యోగా సెంటర్ పెట్టాడు. అయితే అది అయన గురువు పేరు మీద కాకుండా సొంతంగా పెట్టుకుని రాజకీయ పరిచయాలు పెంచుకుని బిజినెస్ పెంచుకున్నాడు. మీడియా ద్వారా త్వరగా జనాలను ప్రభావితం చేయొచ్చనే ఉద్దేశంతో టీవీ లో ప్రోగ్రామ్స్ చేసారు. అలా సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలను చేస్తూ ఆయన సంస్థ పలుకుబడి పెంచుకున్నారు. ఆయన కూతురు వివాహం చేసుకుంది కానీ ఎంతో మంది యువతులు వివాహం చేసుకోకుండా అయన వద్ద సేవ పేరుతో అక్కడే ఉండిపోవాలి, అలా వాలంటీర్ పని చేసినందుకు జీతం కూడా ఇవ్వరు.

ఇషా ఫౌండేషన్ లో ఎంతో మంది అమ్మాయిలను గుండు కొట్టించి సన్యాసం స్వికరించేలా బాబా ప్రోత్సాహిస్తున్నారు. ఇతనికి నిత్యానందకు పెద్దగా తేడా లేదు అంటూ దాము బాలాజీ అభిప్రాయాపడ్డారు. ఇక ఉమర్ సందు సమంత ట్వీట్ తరువాత కొంతమంది తమిళ మహిళలు ఈ విషయంలోకి జగ్గీ వాసుదేవ బాబా ను లాక్కొచ్చారు. ఆయన ఎంతో మందిని సన్యాసం తీసుకోడానికి ప్రేరేపించాడని తమ పిల్లలు గుండు కొట్టించుకుని ఆయన ఆశ్రమంలో ఉన్నారంటూ ఆరోపించారు. కానీ అతని కూతురు మాత్రం పెళ్లి చేసుకుందని అతని వల్లే సమంత, నాగచైతన్య ను వదిలేసిందని వాళ్ళు ఆరోపిస్తున్నారని దాము బాలాజీ తెలిపారు.
































