తన ప్రేమకు అడ్డు వస్తుందనే కోపంతో కన్నతల్లిని ఓ యువతి ప్రియుడితో కలిసి అత్యంత దారుణానికి పాల్పడింది. కన్న తల్లి అనే కనికరం లేకుండా.. ఏ మాత్రం జాలీ, దయ లేకుండా గొంతు నులిపి చంపేశారు. ఈ ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చింతల్ మెట్ లో నివసిస్తున్న నందిని అదే ఏరియాలో నివాసం ఉంటున్న చోటూ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమగా మారింది. వారిద్దరు ఒకరినొకు కలుసుకోవడం.. బయటకు వెళ్లడం.. ఫోన్ లో మాట్లాడుకోవడం చూసి ఆ యువతి తల్లి మందలించింది.
కూతురు వ్యవహారం నచ్చకపోవడంతో తల్లి యాదమ్మ కుమార్తె నందినిని ప్రశ్నించింది. ఆమె అడిగిన ప్రశ్నలకు ఆ యువతి సమాధానం చెప్పలేక పోయింది. ఇలా వాళ్లిద్దరు మాట్లాడుకోవడం.. మధ్యలో ఆమె తల్లి వచ్చి మందలించడంతో.. తమ ప్రేమకు అడ్డు వస్తుందని భావించింది.
దీంతో ఎలాగైనా తన తల్లిని అడ్డు తొలగించుకోవడానికి పథకం వేసింది. అనుకున్నట్లు గానే ప్రియుడిని ఇంటికి రప్పించి తల్లి గొంతు నులిపి చంపేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ మెట్ లో దారుణం చోటు చేసుకుంది.































