టాలీవుడ్ ప్రముఖ దర్శకులు స్వర్గీయ కోడి రామకృష్ణ ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు. అయన దర్శకత్వంలో పని చేయాలనీ ఎదురు చుసిన వారెందరో… టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక శైలి ఏర్పరుచుకున్న దర్శకుడు కోడి రామకృష్ణ. తెలుగు పరిశ్రమలో ఎన్నో విజయాలు అందుకున్న దర్శకుడు కోడి రామకృష్ణ. తెలుగునాట అయన చేయని ప్రయోగాలు లేవనే చెప్పుకోవాలి. ప్రయోగాలు చేయడంలో ఆయనకి ఆయనేసాటి. ఆ ప్రయోగాలను విజయాలుగా మలచడం కూడా అయనకె చెందింది. ఎంతోమంది నటీ నటులను టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి అందించిన ఘనత ఆయనది. అప్పట్లోనే తెలుగు సినెమాలకు గ్రాఫిక్స్ మాయాజాలాన్ని అందించిన ఘనత కూడా ఆయనకే చేందుకుతుంది. అంతేకాదు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాలీవుడ్ టాప్ నటీ నటులకు అయన అందించిన విజయాలు అన్ని ఇన్ని కావు.
“ఆలయ శిఖరం” , “గూఢచారి నం. 1” వంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రాలను చిరంజీవికి అందించారు. “మంగమ్మ గారి మనవడు”, “ముద్దుల మావయ్య”, “భారతంలో బాలచంద్రుడు”, “ముద్దుల కృషుడు”, “మువ్వ గోపాలుడు” వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను బాలకృష్ణ కి అందించారు. అసలు కోడి రామకృష్ణ సినిమా అంటే చాలు తెలుగు ప్రజలలో ఒక రకమైన క్రేజ్ పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరు చూడదగ్గ ఫ్యామిలీ సినిమాలు కూడా తీశారు కోడిరామకృష్ణ. ఆయనతో సినిమా చేసిన తరువాత ఆ హీరో ఇమేజ్ మారిపోయేది. హీరో రాజశేఖర్ కు యాంగ్రీ యుంగ్ మెన్ అనే టాగ్ ను అందించిన ఘనత ఆయనదే. అంకుశం సినిమాతో తెలుగునాట రాజశేఖర్ ఇమేజ్ నే మార్చేశారు. ఆయన డిమాండ్ అమాంతం పెంచేశారు. టాలీవుడ్లో ప్రతి ఒక్క హీరోకి కోడి రామకృష్ణతో అనుబంధం ఉంది. అందరూ హీరోలకి వారి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలను అందించారు.
Advertisement
స్వర్గీయ కోడి రామకృష్ణ రెండో కుమార్తె ప్రవళ్ళిక మరియు సీహెచ్ మహేష్ లు గత అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే పార్క్ హయత్ లో జరిగిన ఈ వేడుకకు టాలీవడ్ అతిరధ మహారధులు అందరు హాజరయ్యారు.
కోడి రామకృష్ణ చిన్న కూతురు వివాహం అంగరంగ వైభవంగా హైదరాబాద్, గండిపేటలోని కన్వెన్షన్ అండ్ ఎక్సిబిషన్స్ లో జరిగింది. బుధవారం రాత్రి 9:36 నిమిషాలు ప్రవళ్ళిక, మహేష్ లు ఒక్కటైయ్యారు. ఈ వేడుకకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరలి వచ్చింది. రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
స్పెషల్ అట్రాక్షన్ చిరు, బాలయ్య మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఇద్దరు ఒకే వేదికపై కలిశారు. ఈ వేడుకలో ఇద్దరు కాసేపు పక్క పక్కనే కూర్చున్నారు. ఆ సమయంల్లో వీరిద్దరూ ఆనందంగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు.
Advertisement
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, మోహన్ బాబు, కె. రాఘవేంద్ర రావు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు, అల్లు అరవింద్, మురళి మోహన్, గోపీచంద్, జయసుధ, జీవిత, రాజశేఖర్ కుమార్తె శివాని, దిల్ రాజు, కోదండ రామిరెడ్డి, కె. విజయ భాస్కర్, శివాజీ రాజా, వినోద్ కుమార్, అలీ, నాగబాబు, నాగబాబు సతీమణి పద్మజ, కుమార్తె నిహారిక, అలనాటి హీరో వినోద్ కుమార్, హేమ తదిరులతో పటు సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.