Director Balaji : ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న ఒక రూమర్, అది నిజం కాదు అని ఇప్పటి వాళ్లకు తెలియదు నిజం అనడానికి సాక్ష్యం లేదు. అదే టీడీపీ అనంతపురం లీడర్ పరిటాల రవి, పవన్ కళ్యాణ్ మధ్య గొడవ, పవన్ కి పరిటాల గుండు కొట్టించడం. ఇప్పటివరకు ఇంకా ఈ రూమర్ అక్కడక్కడా వినిపిస్తు ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ పరిటాల రవి గారి కొడుకు పరిటాల శ్రీరామ్ ను కలవడంతో మరోసారి వైరల్ అవుతోంది. అసలు ఈ రూమర్ నిజమా లేకపోతే అపద్దమా అన్నది క్లారిటీ ఇచ్చారు. నయీం డైరీస్ డైరెక్టర్ బాలాజీ.

స్థలం విషయంలో జరిగింది అది…
నిజానికి స్థలం వివాదంలో జరిగిన గొడవ వల్ల పరిటాల రవి పవన్ కళ్యాణ్ వారి ఊరు వెంకటాపురం కి తీసుకెళ్లి గుండు కొట్టించి పంపారని 1998 ఆ ప్రాంతంలో బాగా రూమర్ వచ్చింది. అయితే నిజానికి అదంతా పుకారు మాత్రమే అందులో నిజం లేదని అప్పటి జర్నలిస్ట్, ఇపుడు నయీమ్ డైరీస్ ను తీస్తున్న డైరెక్టర్ బాలాజీ చెప్పారు. నిజానికి స్థలం విషయంలో అసలు గొడవ జరగలేదని అయన చెబుతున్నారు. హైదరాబాద్ లో కారు బాంబు దాడి అనంతరం పరిటాల రవి ఇంటి వద్ద సెక్యూరిటీ పెంచాలని భావించి చుట్టూ ఉన్న స్థలాలను కూడా కొనాలని రవి అనుకున్నారు. అలా ఒక స్థలం చిరంజీవికి సంబందించినది కావడంతో అయనను సంప్రదించి అడిగిన రేటుకే కొన్నారు. అసలు ఎలాంటి వివాదం ఈ విషయంలో జరగలేదు.

ఇక అసలు పరిటాల గారు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కలిసింది కుడా లేదు. ఇక ఇదే రూమర్ ను పరిటాల గారిని అడిగితే ఆయనే స్వయంగా అలాంటిదేమి లేదు, ఇది టీడీపీ పార్టీ ఆఫీస్ నుండే వచ్చిన రూమర్ అని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు ప్లాప్ అవుతున్న సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లారు ఆ సమయంలోనే గుండు కొట్టించుకున్నారు అంతే తప్ప అసలు ఈ విషయం లో నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు బాలాజీ. కేవలం ప్రస్తుతం ఉన్న రాజకీయ లబ్ది కోసం ప్రత్యర్థులు దీన్ని వాడుకుంటున్నారు. ఇక ఆర్జీవి ‘రక్త చరిత్ర’ సినిమాలో చూపించడంతో నిజం అనుకుంటున్నారు. కానీ అది ఫేక్ అంటూ చెప్పారు బాలాజీ.



























