Connect with us

Featured

అన్నగారు పిలిచి అవకాశమిస్తానంటే వద్దన్న డేరింగ్ డైరెక్టర్ !!

Published

on

తెలుగు చలన చిత్రసీమలో ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు. అందులో ఒకరు డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి. ఈమధ్యనే ఈయన తన సినీ ప్రస్ధానంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాంలో చెప్పుకొచ్చారు. ఈ షోలో తాను సినిమాల్లోకి ఎలా వచ్చారో, సీనియర్ నటుడు ఎన్టీఆర్‌‌తో తనకున్న అనుబంధం ఎలాంటిదో మొదలైన విషయాలను గుర్తు చేసుకున్నారు. తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని కోదండరామిరెడ్డి తెలిపారు. బోర్డులు చూసుకుంటూ ‘ఓహో ఇవన్నీ సినిమా ఆఫీసులా..’ అనుకుంటూ వాటిచుట్టూ తిరిగే వాడినని, చివరకు పీసీరెడ్డిగారి సహకారంతో సినీ దర్శకుడిగా సెట్ అయ్యానని తెలిపారు కోదండరామిరెడ్డి. ఆ తర్వాత సీనియర్ ఎన్టీయార్ గారితో తనకున్న అనుబంధం గురించి వివరించారు.

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఆ తరం దర్శకులంతా అన్నగారితో ఒక్క సినిమా అయినా డైరెక్ట్ చెయ్యాలని కలలు కనేవాళ్లు. ఆ రోజుల్లో ఎన్టీఆర్‌ ఇమేజ్‌ను సరిగ్గా అంచనా వేస్తూ రాఘవేంద్రరావు, దాసరి లాంటి సీనియర్ దర్శకులే పోటీపడీ మరీ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చేవారు. అలాంటిది మన దర్శకుడు కోదండరామిరెడ్డి మాత్రం అన్నగారు పిలిచి అవకాశం ఇస్తానన్నా కూడా చేయనని ఖరాఖండిగా చెప్పేసాడు. ఆరోజుల్లో అన్నగారికి ఎదురుచెప్పేంత అంత ధైర్యం ఎవరికీ లేదు. కానీ ఏడాదికి కనీసం అరడజన్ సినిమాలు చేసేంత బిజీగా వున్న కోదండరామి రెడ్డిని అన్నగారు పిలిచి రెండుసార్లు ఈయనకు సినిమా చేయాలంటూ ఆఫర్ ఇచ్చారు. కానీ అప్పుడున్న బిజీ కారణంగా ఈయన ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు.

నిజానికి అన్నగారినికూడా డైరెక్ట్ చేసి ఉంటే.. తెలుగులో అందరు హీరోలతో సినిమాలు చేసిన ఏకైక దర్శకుడిగా కోదండరామిరెడ్డి చరిత్ర సృష్టించేవారేమో.! కానీ ఏం చేస్తాం.. ఆ రోజుల్లో ఎన్టీఆర్ సినిమా విలువ తెలియకే వచ్చిన అవకాశాన్ని వదిలేసానని చెప్పుకొచ్చారు డైరెక్టర్ కోదండరామి రెడ్డి. సీనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయకపోయినా కె.రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంటుగా పని చేస్తున్నపుడు వేటగాడు సినిమాలో మాత్రం ఓ పాట చిత్రీకరించానని ఆనందంగా చెప్పారు కోదండరామి రెడ్డి.

ఇంకా ఎన్టీఆర్ తో వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఇలాంటి సంఘటననే మరొకొటి పంచుకున్నారు కోదండరామిరెడ్డి. ఆరోజుల్లో ఎన్టీఆర్ వారసుడు బాలయ్యతో ‘అనసూయమ్మగారి అల్లుడు’ తీశారు. అది సూపర్‌ డూపర్‌ హిట్‌ అవడంతో తర్వాత చిత్రం మనం చేస్తున్నాం బ్రదర్‌’ అని ఎన్టీఆర్ అన్నారని, సబ్జెక్ట్‌ రెడీ అవడంతో వినడానికి రమ్మన్నారని, పరుచూరి బ్రదర్స్‌, తాను కలిసి వెళ్లామని చెప్పారు. కథ చెప్పిన తర్వాత ‘ఎలా ఉంది బ్రదర్‌’ అని ఎన్టీఆర్ అన్నారని, దానికి సమాధానంగా ‘నాకు నచ్చలేదండీ’ అని చెప్పానని.. ఆ వెంటనే ‘మీకు నచ్చకపోతే మేమెందుకు చేస్తాం. వదిలేయండి. తర్వాత ఎప్పుడైనా చేద్దాం’ అని ఎన్టీఆర్ చెప్పారని కోదండరామిరెడ్డి అన్నారు.

అయితే పెద్దాయనతో అలా చెప్పినందుకు బయటకు రాగానే పరుచూరి బ్రదర్స్‌ తనను మందలించారని అన్నారు. ఓ వారం గడిచిన తర్వాత ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి, ‘సర్‌ సీఎంగారు లైన్‌లో ఉన్నారు’ అని ఫోన్‌ ఇచ్చాడని.. ఆ ఫోన్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘బ్రదర్ ఆ కథ మాకు నచ్చింది. మీరు ఎలాగైనా చేసి పెట్టాలి’ అన్నారని, దీంతో ఆ మాట కాదనలేక ఆ సినిమా చేశామని ఆ సినిమాయే ‘తిరగబడ్డ తెలుగు బిడ్డ’ సినిమా అని తెలియజేశారు. చదివారుగా.. ఎన్టీఆర్ తో ఏ.కోదండరామిరెడ్డి గారి మధుర జ్ణాపకాలు.. వీలైతే ఈ లాక్ డౌన్ తీరిక సమయాలలో అన్నగారి పాత సినిమాలను చూసి మీరూ ఎంజాయ్ చేయండి.😀😀😀

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!