Connect with us

Featured

అలనాటి నటుడు జగ్గయ్య మనవడు కూడా వెండితెరపై నటిస్తున్నాడని మీకు తెలుసా.?!

Published

on

కంచు కంఠంతో స్పష్టమైన ఉచ్చరణతో సంభాషణలు పలికించే కొంగర జగ్గయ్య ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్ సమకాలీన నటుడిగా చెప్పుకోవచ్చు. అందుకే కొంగర జగ్గయ్య ను కళావాచస్పతి అన్నారు.1928 డిసెంబర్ 31న గుంటూరు జిల్లా తెనాలి దగ్గర మోరంపూడి గ్రామంలో జన్మించారు. ఉన్నత చదువులు పూర్తయిన తర్వాత విలేకరిగా కొన్ని రోజులు పని చేయడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్ర రిపబ్లిక్ పత్రికకు ఎడిటర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆకాశవాణి రేడియోలో న్యూస్ రీడర్ గా కొన్ని రోజుల పాటు పనిచేస్తుండగా..

త్రిపురనేని గోపీచంద్ పరిచయం ఏర్పడి, 1952లో ఆయన దర్శకత్వంలో తీసిన ప్రియురాలు అనే చిత్రంలో మొదటగా జగ్గయ్య నటించారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో రేడియో న్యూస్ రీడర్ గా స్వస్తి పలికి దాదాపు మూడు సినిమాలకి సైన్ చేయడం జరిగింది. అలా బి.యన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన బంగారు పాప చిత్రంలో నటించారు. ఇక్కడి నుంచి ఆయన సినీ ప్రయాణం ఎటువంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగింది. వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన అనేక సినిమాల్లో కొంగర జగ్గయ్య నటించారు. సెకండ్ హీరోగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు లతో చేసినప్పటికీ ఆ తర్వాత వారి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. తమిళంలో శివాజీ గణేషన్ సినిమాలు తెలుగులోకి డబ్ అయినప్పుడు ఆయనకి జగ్గయ్య డబ్బింగ్ చెప్పడం జరిగింది. అలా జగ్గయ్య కంచు కంఠంతో చెప్పిన సంభాషణల సినిమాలు చూసి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కళావాచస్పతి అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఆనాటి నటులతోనే కాకుండా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలతో కూడా నటించడం జరిగింది.

చివరిగా మోహన్ బాబు హీరోగా నటించిన డిటెక్టివ్ నారద లో నటించి 2004లో కొంగర జగ్గయ్య తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో ఆయన వారసులు తెలుగు సినీ పరిశ్రమలో లేరు అనుకునే సమయంలో ఆయన సోదరుడు మనవడైన చేస్తూ సాత్విక్ కృష్ణ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడం జరిగింది. శ్రీనివాస్, సుధారాణిల కు చేస్తూ సాత్విక్ కృష్ణ జన్మించాడు. తండ్రి శ్రీనివాస్ రాజకీయనాయకుడు అయినప్పటికీ తల్లి సుధారాణి స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. 2012 లో బీటెక్ పూర్తి చేసిన చేస్తూ సాత్విక్ కృష్ణ.. చిన్నప్పట్నుంచి నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్న చేస్తూ సాత్విక్ కృష్ణ ఎంతో ఇష్టాన్ని కనబరిచేవారు. తర్వాత అర్ధనారి అనే సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేస్తూ సాత్విక్ కృష్ణ కనిపించారు. ఆ తర్వాత ట మంజులానాయుడు దర్శకత్వంలో శ్రావణ సమీరాలు సీరియల్ లో నటించారు. అలాగే అభిషేకం, కోయిలమ్మ, స్వాతి చినుకులు లాంటి సీరియల్స్ లో నెగెటివ్ రోల్స్ చేస్తూ సాత్విక్ కృష్ణ రోజు బుల్లితెరపై కనిపిస్తున్నాడు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!