Connect with us

Featured

అత్యధిక పారితోషికం తీసుకుంటున్న బుల్లితెర సీరియల్స్ నటీమణులు!!

Published

on

సినీ రంగంలో హీరోయిన్ల రెమ్యునరేషన్ ల వివరాలు తెలుసుకుని ఆశ్చర్య పోవడం సహజం. ఎందుకంటే.. ఒక్కో చిత్రానికి కోటి నుంచి రూ.10 కోట్లు తీసుకునే అందాల తారలు తెలుగు సినిమా రంగంలో ఉన్నారు. ఒక్క పాటకు కోటి రూపాయలు తీసుకునే హాట్ గర్ల్స్ కూడా మన టాలీవుడ్‌లోనే ఉన్నారు. మరి బుల్లితెర విషయానికొస్తే.. సీరియ‌ల్స్.. సినిమాలను మించిన మంచి బిజినెస్.

స్క్రీన్ పై నవరసాలను ఆవలీలగా ఆరబోసే ప‌ట్టుంటే చాలు ఎపిసోడ్స్ కు ఎపిసోడ్స్ లే లాంగిచేయొచ్చు. అది కూడా లో బ‌డ్జెట్ లో.. ఇందుకు ఉదాహరణగా మన తెలుగు బుల్లితెర సీరియల్స్ మొగ‌లి రేకులు, కార్తీక దీపాలు నే చెప్పవచ్చు. సినిమా తార‌ల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా సీరియ‌ల్ న‌టీనటుల‌కు రెమ్యున‌రేష‌న్స్ ద‌క్కుతున్నాయి. వాళ్ళకీ.. సినిమాలో నటించే తారలకూ తేడా ఏమిటంటే.. సీరియల్స్ నటీమణులకు ఒన్ డే కాల్షీట్ లెక్క‌న రెమ్యున‌రేష‌న్ ఉంటుంది.! మరి ఈ లెక్కన ఏ సీరియల్ నటి ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో మీరే చదవండి..

ప్రేమి విశ్వనాధ్

Advertisement

ప్ర‌స్తుతం సీరియ‌ల్స్ గురించి మాట్లాడాలంటే మొదటిస్ధానంలో నిలిచేది ‘కార్తీక‌దీపం’ సీరియల్ అనే చెప్పాలి. వంట‌ల‌క్క పేరు చెప్తే చాలు మహిళలు వంట చేయడం మానేస్తారు. అలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ వున్న ఈ సీరియల్ నటి అస‌లు పేరు ప్రేమి విశ్వనాధ్. సీరియ‌ల్ లో దీప పాత్రలో నటిస్తున్నందుకు ఈమె రోజుకు తీసుకునే రెమ్యునరేషన్ అక్షరాల రూ. 25,౦౦౦

సుహాసిని

‘చంటిగాడు’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన సుహాసిని త‌ర్వాత సీరియ‌ల్స్ లో సెటిలైపోయింది. ‘అపరంజి’ సీరియల్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఈ సీరియ‌ల్ లో నటిస్తున్నందుకు ఈమె రోజుకు తీసుకునే రెమ్యున‌రేష‌న్ అక్షరాల రూ.20,000.

ఐశ్వర్య

‘అగ్నిసాక్షి’ సీరియల్లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ఐశ్వర్య ఒక రోజు రెమ్యునరేషన్ అక్షరాల రూ. 20,000

నవ్యస్వామి

Advertisement

‘నా పేరు మీనాక్షి’ సీరియల్ ద్వారా పరిచయమైన నవ్య స్వామి ప్రస్తుతం ‘ఆమెకథ’ సీరియల్లో నటిస్తుంది. ఈ సీరియల్ లో నటిస్తున్నందుకు గానూ నవ్య ఒక రోజుకి అందుకునే రెమ్యునరేషన్ అక్షరాల రూ.20,000.

పల్లవి రామిశెట్టి 

బుల్లితెర అనుష్క‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప‌ల్ల‌వికి ‘ఆడ‌దే ఆధారం’ సీరియల్ బ్రేక్ ఇచ్చింది. ఈ సీరియల్ లో నటిస్తున్నందుకు పల్లవి ఫర్ డే రెమ్యున‌రేష‌న్ అక్షరాల రూ.15,000.

అషికా

‘కథలో రాజకుమారి’ సీరియల్లో అవని పాత్ర పోషించిన అషికా రోజువారి రెమ్యునరేషన్ అక్షరాల రూ. 12,000 .

హరిత

Advertisement

‘వైదేహీ’ సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన హరిత ఎన్నో సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం కుంకుమ పువ్వు, ముద్ద మందారం లాంటి టాప్ సీరియల్స్ లో నటిస్తున్న హరిత ఒక రోజుకి తీసుకునే రెమ్యునరేషన్ అక్షరాల రూ. 12,000.

సమీరా షరీఫ్

కొన్ని రోజులు ‘అదిరింది’ షోకి యాంక‌ర్ గా చేసిన స‌మీరా.. సీరియ‌ల్స్ లో కూడా నటిస్తుంటుంది. ఇందుకు గానూ ఈమె రోజుకు తీసుకునే రెమ్యున‌రేష‌న్ అక్షరాల పదివేల రూపాయలు.

ప్రీతినిగమ్

అటు సినిమాలు, ఇటు సీరియ‌ల్స్.. ఎటు ఛాన్స్ వ‌స్తే అటు.. ఈవిధంగా బుల్లితెర మరియు వెండితెరపై కూడా కనిపిస్తూ.. ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న ప్రీతి నిగమ్ రోజువారి రెమ్యూన‌రేష‌న్ అక్షరాల రూ. 10,000.

మంజుల

Advertisement

‘చంద్రముఖి’ సీరియల్ ద్వారా త‌న కెరీర్ ను ప్రారంభించిన మంజుల, ఆ సీరియ‌ల్ లో త‌న‌తో కో యాక్ట‌ర్ గా న‌టించిన నిరుపమ్ ని పెళ్లి చేసుకుని బుల్లితెర‌కు కొన్ని రోజులు బైబై చెప్పేసింది. కొంతకాలం త‌ర్వాత ‘క్రిష్ణవేణి’ సీరియ‌ల్ తో సెకెండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన ఈమె రెమ్యునరేషన్ రోజుకు అక్షరాల రూ.8000.

Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!