‘ఏక్షణమైనా చెలియా నీ జ్ణాపకం..” ఈ పాట వినగానే టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో మెరిసే రూపం నటి కౌసల్య. నువ్వే నా ప్రేయసి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్న ఈ అందాల భామ మీకు గుర్తుందా.?

ఏంటీ ఇంకా గుర్తుకు రాలేదా.?! అదేనండీ జగపతి బాబు హీరోగా నటించిన “అల్లుడుగారు వచ్చారు” చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన కౌసల్య కోసమే ఇప్పుడు మీరు చదవబోతున్నారు. మన టాలీవుడ్ హీరో శ్రీకాంత్ సరసన ఈమె నటించిన “పంచదార చిలక” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే గాకుండా నటి కౌసల్యకు మంచి గుర్తింపును కూడా తెచ్చి పెట్టింది. నటి కౌసల్య తమిళం, మరియు తెలుగు చిత్రాలలో నటించినా వాస్తవానికి ఆమె కన్నడ నటి అన్న విషయం చాలా మందికి తెలియదు. తన అందం, అభినయం, నటనతో బాగానే ఆకట్టుకున్న నటి కౌసల్య కి ప్రస్తుతం 40 సంవత్సరాలు వచ్చాయి.

దీంతో ఈ అందాల తార పెళ్లి గురించి సోషల్ మీడియాలో కొన్ని గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. మలయాళ చిత్రసీమకు చెందిన ఓ స్టార్ హీరోతో ఈ అమ్మడు అప్పట్లో ప్రేమాయణం నడిపిందని, ఆ హీరో మాత్రం ఓ బడా వ్యాపారవేత్త కూతురిని పెళ్లి చేసుకున్నాడని దాంతో కొంతకాలం పాటు నటి కౌసల్య తీవ్ర మనస్థాపానికి గురై సినీరంగానికి దూరమైందని మీడియా టాక్. డిప్రెషన్ నుండి కోలుకొని మళ్లీ ఇటీవలే సినిమాల్లో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. టాలీవుడ్ లో ఈమధ్యనే అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా నటించిన “రారండోయ్ వేడుక చూద్దాం”, “సవ్యసాచి” తదితర చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ అందాల నటి మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం భాషలలో కలిపి ఇప్పటి వరకూ 30కి పైగా చిత్రాల్లో నటించింది. మరి పంచదార చిలక లాంటి ఈ నటి జీవితం మరెన్ని మలుపులు తిరగబోతుందో కాలానికే తెలియాలి. ????????????



























