Doctor Harshavardhan Yepuri : ఈ భూమి మీద పుట్టిన ఏ జీవి అయినా మరణించక తప్పదు. వైద్యం ఎంత అభివృద్ధి చెందినా మన మరణాన్ని ఆపలేదు. అందరం మరణించే వాళ్ళమే అయినా కొంచం ముందు వెనుక వెళ్తాము. కానీ ఆ మరణం మనకు ఎపుడు వస్తుందో తెలియకుండా బ్రతికేస్తున్న మనకు మన మరణం పలానా రోజు అని తెలిస్తే ఎలా జీవిస్తాం. మన ఎక్స్పైరి డేట్ తెలిస్తే బతకాగలమా, నిరాశలో ఉండిపోతామా, ఇలాంటి పరిస్థితి ఖమ్మంకి చెందిన డాక్టర్ హర్షవర్ధన్ కి ఎదురైంది. తాను మరణించేదెపుడో డాక్టర్లు చెప్పేసినా ఏ మాత్రం అధైర్య పడకుండా చావును చిరునవ్వుతో ఆహ్వానించాడు హర్ష. మరణాన్ని కూడా ఎంతో పద్దతిగా తన అనుకున్నవాళ్లకు భారం కాకుండా ఎవరి కంటా కన్నీళ్ళు రాకుండా తాను మానసికంగా దృఢంగా ఉండటమే కాకుండా తన వాళ్లను సిద్ధం చేసి వెళ్ళాడు, మనందరికీ స్ఫూర్తి నింపాడు డాక్టర్ హర్ష వర్ధన్.
అమ్మ నేను బ్రతకను అని ఫోన్ చేసి ఏడ్చాడు…
డాక్టర్ హర్షవర్ధన్.. ఖమ్మకి చెందిన 32 ఏళ్ల ఈ యువకుడు చదువులో ఎపుడూ ఫస్ట్, అలానే డాక్టర్ గా ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం, లైఫ్ సెటిల్ అయింది. ఇక జీవితంలో అత్యంత మధిర ఘట్టం పెళ్లి, సింధు అనే ఒక అమ్మాయిని చూసి నచ్చి తనతో లాక్ డౌన్ కి ముందు వివాహం కూడా గ్రాండ్ గా చేసుకున్నాడు హర్ష. పెళ్లయ్యాక ఒక నెల పాటు ఉండి ఆపైన వీసా గడువు ముగియడంతో ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. అయితే అదే సమయంలో లాక్ డౌన్ వల్ల సింధు హర్ష వద్దకు వెళ్లలేకపోయింది. ఎపుడూ ఫిట్ గా ఉండి శుభ్రంగా ఉండాలనిందరికీ చెప్పే హర్ష జిమ్ చేస్తుండగా ఆయాసం రావడంతో స్వాతహగా డాక్టర్ అయిన తాను పరీక్షలు చేసుకోగా క్యాన్సర్ మహమ్మారి సోకినట్లు తేలింది. క్యాన్సర్ అని తెలిసాక ఇండియా రావడానికి కానీ ఇండియా నుండి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళడానికి వీలు లేని సమయంలో తనలో తానే కుమిలి పోయాడు. తనకు క్యాన్సర్ అని తల్లికి చెప్పి ఏడ్చేసాడు. అయినా భయపడకుండా చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపి భరోసా ఇచ్చాడు. అయితే మొదట్లో చికిత్సకు క్యాన్సర్ తగ్గుముఖం పట్టినా అప్పటికే లివర్, కిడ్నీ కి ఊపిరి తిత్తుల నుండి క్యాన్సర్ సోకి బ్రెయిన్ కి కూడా పాకడంతో తన మరణం తప్పదని హర్షకి అర్థమైంది.
Advertisement
అయితే ఇక్కడే హర్ష అందరిలా కాకుండా తానేంటో ప్రపంచానికి చూపాడు. తన వల్ల తనని పెళ్లి చేసుకున్న అమ్మాయి బాధపడకూడదని తనని ఒప్పించి విడాకులు తీసుకుని మరణించేవరకు స్నేహితులుగా ఉందామని చెప్పి ఒప్పించాడు. ఆ అమ్మాయి అమెరికా లో చదువుకునే ఏర్పాట్లు చేసి అమెరికా పంపాడు. ఇక నిరంతరం తన జీవితం అస్వాదించడం నేర్చుకున్నాడు. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో తన వైద్య సేవలను అందిస్తూ వారితో గడుపుతూ సంతోషం వెతుక్కున్నాడు. తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వస్తామని చెప్పినా తాను కిమో తీసుకోవడం వల్ల తాను పడుతున్న బాధ వాళ్ళు చూడలేరని వద్దని చెప్పాడు. చివరిగా ఇండియా వచ్చి తల్లిదండ్రులతో పదిహేను రోజులు గడిపి అపై మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. ఈసారి డాక్టర్లు తాను మరణించబోయే తేదీని చెప్పేసారు. మార్చి 27 లోపు మరణించవచ్చని తెలిపారు. ఇక హర్ష తన మరణం తరువాత పేరెంట్స్ ఇబ్బంది పడుకూడదని భావించి తన శవపేటిక కూడా సిద్ధం చేయించాడు. లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా తన స్నేహితులకు అనుమతి ఉండేలా అన్నీ సిద్ధం చేసాడు. తాను మరణించే ముందు రోజు తాను పనిచేస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్ వారితో గడిపి వాళ్లకు వీడ్కోలు పలికాడు. ఇక ఇంట్లో తన స్నేహితుడితో ఉన్న హర్ష మరణించే రోజు కుటుంబ సభ్యులతో మాట్లాడి మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పి కాఫీ తాగాలని ఉంది అని ఫ్రెండ్ కి చెబితే మళ్ళీ వెళదాం అని తన ఫ్రెండ్ చెప్పడంతో తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి కాఫీ తాగి వచ్చాడు. ఇంటికి వచ్చాక బాత్రూం వెళితే మూత్రంలో రక్తం రావడంతో తన చావు సమీపిస్తోందని అర్థమై స్నేహితులతో తాను కాసేపు పడుకుంటానని చెప్పి వెళ్లి పడుకున్న రెండు నిమిషాలకే హర్ష మరణించాడు. ఇక హర్ష గురించి తల్లిదండ్రులు చెబూతూ కన్నీటిపర్యంతం అయిపోయారు.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.