Doctor Ravikanth : నందమూరి తారక రత్న కుప్పంలో జరిగిన నారా లోకేష్ సభకు హాజరై అక్కడ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలిండం చకచకా జరిగిపోయాయి. తారక రత్నకు గుండె నొప్పి రావడంతో తనని చికిత్స కోసం బెంగళూరు లోని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించడానికి వస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చెబుతున్నా ఇంకా పరిస్థితి క్రిటికల్ గా ఉందంటూ తెలుస్తోంది. తాజాగా విడుదల అయిన హెల్త్ బులిటెన్ లో బ్రెయిన్ కి సంబంధిచిన డామేజ్ ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే ఆ విషయాల గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ రవికాంత్ గారు వివరించారు.

ఐదు నిముషాలు ఆలస్యమైనా…
రవికాంత్ గారి తారక రత్న హెల్త్ కండిషన్ గురించి మాట్లాడుతూ ఆవును ఆయనకు పాదయాత్ర సమయంలో ఆ జనం గుంపులో గుండె పోటు వచ్చిన సమయంలో మొదటి కొద్ది నిముషాలు అత్యంత కీలకం, ఆ సమయంలో వెంటనే చేస్ట్ కంప్రెస్స్ చేసి సీపీఆర్ చేయడం వల్ల ఆయన బ్రతికాడు. ఆ సమయంలో టైంకి అలా చేయకుండా ఉండుంటే గుండె ఆగయిపోవడం వల్ల బ్రెయిన్ కి రక్తం సరఫరా ఆగిపోయి డామేజ్ అయ్యుండేది. అయితే సీపీఆర్ చేయక ముందు రక్తం సరఫరా ఎంత శాతం వరకు బ్రెయిన్ కు ఆగిపోయింది అన్న విషయం మీద బ్రెయిన్ డామేజ్ ఆధారపడి ఉంటుంది.

వెంటనే చేసినా ఆయనకు గుండె పోటు రావడానికి చికిత్స అందడానికి మధ్య ఉన్న సమయంలో జరిగిన విషయాలు కీలకం. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందుకుంటున్న తారకరత్న చికిత్సకు కొద్దిగా స్పందిస్తున్నారు. అయితే ఎక్కువ కాలం వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు అంటే కోలుకునే అవకాశాలు చేజరుతున్నాయి అన్నది చేదు నిజం. కాకపోతే న్యూరాలోజిస్ట్ లు పరీక్షలు జరిపి అసలు బ్రెయిన్ ఎంత డామేజ్ అయింది, దానికి చికిత్స ఎమి ఇవ్వాలి అన్నది ఆల్రెడి డిసైడ్ చెసుంటారు. అయితే ప్రస్తుతానికి మొదటి 45 నిముషాలు వెంటనే కుప్పంలో అందించిన వైద్యం వల్లే తారక రత్న ఇంకా ఉన్నారన్నది వాస్తవం అంటూ చెప్పారు డాక్టర్ రవికాంత్.
































