Connect with us

Featured

ముఖ్యమంత్రి కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్న డాక్టర్ గురవారెడ్డి..ఈయన కూతురు మన టాలీవుడ్ స్టార్ అని మీకు తెలుసా..!

Published

on

మీలో లిటిల్ సోల్జర్స్ సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన పాపాయి అంటే ఇష్టం లేని వారెవరైనా ఉన్నారా..అస్సలు ఉండరు ..అప్పట్లో ఒక సంచలనం సృష్టించిన ఈ బుల్లి తార గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్న అనుకుంటున్నారా..మొన్నీ మద్యే పెళ్లి చేసుకున్న ఈ బుల్లి స్టార్ తల్లిదండ్రులు మనకు బాగా తెలిసిన వారే..వారు మరెవరో కాదు సన్ షైన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ గురవారెడ్డి.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈయన చాల ఫేమస్ అయ్యారు. ఇక ఈయన ప్రేమించి పెళ్లాడింది ఒక ముఖ్యమంత్రి కూతురిని ..మరి అస్సలు ప్రేమ ఎలా పుట్టింది పెళ్లి ఎలా జరిగింది ముఖ్యమంత్రి కూతురిని ఎలా పటాయించారో ఇప్పుడు తెలుసుకుందాం.

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ గురవారెడ్డి గుంటూరు జిల్లాలో జన్మించారు. ఉత్తమ ఆర్థోపెడిక్ గా ( మోకాళ్ళ ఎముకలు మార్చగల, జాయింట్ చేయగల డాక్టర్ గా ప్రఖ్యాతి చెందారు) దక్షిణాది భారతదేశంలో చాలా కాలం పాటు ఎంతో మందికి సేవలు చేసిన గురవా రెడ్డి చాలా సాదాసీదాగా ఉంటారు. నేనే గొప్ప డాక్టర్ అని తాను ఏ దర్పం అసలు చూపించరు. గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన గురవా రెడ్డి హైదరాబాద్ నగరంలో సన్ షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించి ఎంతో మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. గురవారెడ్డి గారు ఒక్కరే సంవత్సరానికి నాలుగువేల మోకాలు ఆపరేషన్లు చేస్తారు. ఇంగ్లాండులోని యూనివర్సిటీ ఆఫ్ లివర్ పూల్ నుండి ఎంసిహెచ్ లో పట్టభద్రులయ్యారు. ఎఫ్ఆర్సిఎస్ (లండన్) ఎఫ్ఆర్సిఎస్ గ్లాస్గో ఎఫ్ఆర్సిఎస్(ఎడిన్బర్గ్) ఇలా 3 ఎఫ్ ఆర్ సి ఎస్(FRCS) చదువులను మూడు ప్రముఖ దేశాల్లో పూర్తి చేశారు. పూణే సంచేటి ఇన్స్టిట్యూట్ లో ఎముకలకు సంబంధించిన వైద్యవిద్యను అభ్యసించారు.

అయితే గురువా రెడ్డి కొడుకు, కూతురు అలాగే అల్లుడు కూడా వైద్య వృత్తిలో పెద్ద డాక్టర్లుగా కొనసాగుతున్నారు. అతని భార్య కూడా గైనకాలజిస్ట్ గా ఆడవారికి చికిత్సనందిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి కుమార్తె అయిన భవాని రెడ్డి ని డాక్టర్ గురవారెడ్డి గారు వివాహం చేసుకున్నారు. నటుడు ఎన్టీరామారావు కంటే ముందుగా భవనం వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వ్యవహరించారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో భవాని రెడ్డి ఎంబిబిఎస్ చదువుకోగా అతను మాత్రం గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అయితే గురవారెడ్డి కి భవాని రెడ్డి గారు నాలుగేళ్ళు జూనియర్. అయితే వీళ్ళిద్దరూ బంధువులే కావడంతో ఒకరినొకరు ఇష్టపడి తదనంతరం పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!