కరోనా కష్టాలు ఎవరిని వదలడంలేదు. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో కరెంట్ బిల్లు చెల్లింపుదారులకు కరెంట్ బిల్లుల కష్టాలు వచ్చిపడ్డాయి. ఈ లాక్ డౌన్ సమయంలో ఇంట్లోంచి కదలలేని పరిసితి ఇటు వంటి పరిస్థితులలో కరెంట్ బిల్లులు ఎలా కట్టాలో తెలియక సతమమవుతున్నారు. అయితే అధికారులు మాత్రం నిర్ణీత సమయంలో బిల్లులు కట్టాల్సిందే అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్యా లేట్ ఫీజు ను మాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

మరోపక్క లాక్ డౌన్ కారణంగా విద్యుత్ ఉద్యోగులు కరెంట్ మీటర్ రీడింగ్ తీసుకోవడం కోసం రావడం లేదు. కానీ ప్రస్తుతం గత నెల ఫిబ్రవరిలో జరిగిన విద్యుత్ వినియోగం ఆధారంగా మార్చి నెల బిల్లులు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ లో ఎంత అమౌంట్ అయితే చెల్లించారో ఇప్పుడు కూడా అంటే చెల్లిస్తే సరిపోతుందని అధికారులు అంటున్నారు. కానీ నిర్ణీత గడువులోపలే చెల్లించాలని చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా మూడు నెలలు కరెంట్ బిల్లులు కట్టకపోయినా పరవాలేదని చాలా మంది అపోహ పడుతున్నారని, బిల్లు చెలించకపోతే పెనాల్టీ వేయడంతో పాటుగా కనెక్షన్ కూడా తొలగిస్తామని అధికారులు తెలిపారు.




























