దేశంలో నకిలీ కరెన్సీ నోట్లు భారీగా పెరిగిపోతున్నాయని స్వయంగా భారత రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఇటీవలే RBI నిర్వహించిన ఒక సర్వేలో భారత్ లో భారీగా ఫేక్ కరెన్సీ నోట్లు చలామణీలో ఉన్నాయని గుర్తించింది. వీటిలో ముఖ్యంగా రూ.500 నోట్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది RBI.

తాజగా రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సర్వే ప్రకారం 2020-21 వార్షిక ప్రాతిపదికన చూస్తె రూ.500 రూపాయిల దొంగనోట్లు 31.4 శాతం పెరిగినట్టు వెల్లడించింది అర్బిఐ. అయితే ఈ క్రమంలో 500 నోట్లు తప్పితే.. ఇతర కరెన్సీ నోట్లలో నకిలీలు భాగా తగ్గినట్లు స్పష్టం చేసింది RBI.



























