Falaknuma palace History : ఫలక్ నుమా ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో చార్మినార్ కు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉండే ప్యాలెస్. తేలు ఆకారంలో నిర్మించబడిన ఇటలీయాన్, టుడూర్ ఆర్చిటెక్చర్ తో నిర్మితమైంది. ఉర్దూలోని ఫలక్ నుమా అనగా తెలుగులో ఆకాశ ధర్పణం. ఈ ప్యాలస్ తేలు ఆకృతిలో ఉంటూ 60 గదులు, 22 విశాలమైన హాళ్లు ఉండి ఇక డైనింగ్ హాల్లో ఒకేసారి 100 మంది భోజనం చేసే వీలు ఉంది. ఇక డైనింగ్ భవనంలో గోడలు బంగారు వర్ణంలో మెరిసిపోతు ఆకర్షస్థాయి. ఫలక్ నుమా ప్యాలెస్ “పైగా”వంశస్థుల కట్టడం. మన దేశంలో ముస్లిం రాజుల పరిపాలన సమయంలో ఎన్నో కట్టాడాలు నిర్మితమవగా నిజాం ప్రభువుల కాలంలో హైదరాబాద్ లో నిర్మితమైన ఫలక్ నుమా ప్యాలెస్ అత్యంత సుందరమైన కట్టాడాల్లో ఒకటిగా నేటికీ ఉంది. దీని నిర్మాణానికి అప్పట్లో 40 లక్షలు ఖర్చు కాగా దీన్ని నిర్మాణం వల్ల కట్టించిన వ్యక్తి ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆ ప్యాలెస్ లోని ఒక దర్పణం ఖరీదు సుమారు 35 కోట్లు. ఇక ఇలాంటి విశేషలు ఉన్న ఫలక్ నుమా ప్యాలెస్ అసలు ఎవరు నిర్మించారు ఎందుకు అనే విషయాలు తెలుసుకుందాం..

పైగా వంశస్థుల నుండి నిజాం వారి చేతుల్లోకి ప్యాలెస్…
ఫలక్ నుమా ప్యాలెస్ నిర్మాణం మార్చ్ 3 1884 లో కట్టించడానికి శంకు స్థాపన చేసారు. ఇక ఈ భవనం అన్ని హంగులతో పూర్తవడానికి దాదాపు తొమ్మిదేళ్లు పట్టింది. ఇక ఫలక్ నుమా ప్యాలెస్ ను హైదరాబాద్ ప్రధానమంత్రి ఆరవ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ బహదూర్ యొక్క బావ అయిన నవాబ్ వికారుల్ ఉమ్రా నిర్మించారు. ఈ భవనంను మూడు వందల ఎకరాల్లో నిర్మించారు. ఫలక్ నుమా ప్యాలెస్ లో ప్రధాన భాగం 93,971 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఇటలీ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన పాలరాళ్లతో పరిచారు.

ఇక భవనంలో రంగురంగుల అద్దాల పట్టకాలను కిటికీ నిర్మాణంలో ఉపయోగించడం వల్ల గదులు మరింత ఆకర్షిణీయంగా కనిపిస్తాయి. ఫలక్ నుమా ప్యాలెస్ లో నివాసం ఉండటానికి సర్ వికారుల ఉమ్రా కట్టించుకున్నారు. కానీ ఈ భవనం నిర్మాణానికి ఖర్చు ఎక్కువ అవడం వల్ల ఆయన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఇక భార్య సలహా మేరకు ప్యాలెస్ కు నిజాం ప్రభువు మహబూబ్ ఆలీ పాషా ను ఆహ్వానించగా ఆయన ప్యాలెస్ అందానికి ఫిదా ఆయ్యారట. ఇక నిజాం ప్రభువు ప్యాలెస్ నిర్మాణం వల్ల వికారుల్ ఉమ్రా ఆర్థిక ఇబ్బందులను ఎదురకొంటున్నారని తెలిసీ ఆర్థిక సహాయం చేసారు. వికారుల్ కు భవన నిర్మాణానికి అయిన అప్పులను తీర్చడానికి చాలా కాలం పట్టిందట. ఇక 1895 లో నిర్మాణం ఖర్చులు చెల్లించి నిజాం ప్రధాన మంత్రి మహబూబ్ ఆలీ పాషా కొనుగోలు చేసారు. అలా పైగా వంశస్థుల చేతి నుండి నిజాం వంశస్థుల చేతిలోకి భవనం వెళ్ళిపోయింది. ఇక 2000 సంవత్సరం వరకు సాధారణ ప్రజలకు అనుమతి లేని ఫలక్ నుమా ప్యాలెస్ తాజ్ గ్రూప్ అద్దెకు తెసుకుని 2010 నుండి ఆధునీకరించి అన్ని వసతులను కల్పించి హోటల్ గా ప్రారంభించారు.



























