Connect with us

Featured

టాలీవుడ్ లో మెగా వారసురాలు నిహారిక గురించి ఈ విషయాలు తెలుసా.?

Published

on

మెగా కుటుంబం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వార‌సులుగా ఎంతో మంది హీరోలు వెండితెర‌కు ప‌రిచ‌య‌మై ఎవ‌రి నటనలో వాళ్ళు తమ స‌త్తా చాటుకున్న సంగతి తెలిసిందే. అలాగే మెగా కుటుంబం నుంచి వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన ఒకే ఒక్క క‌థానాయిక నిహారిక కొణిదెల‌. బుల్లితెర‌పై యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈ అందాల భామ ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్‌ లలో కూడా న‌టించింది. వెండితెర‌పై “ఒక మ‌న‌సు” చిత్రంతో పరిచయమైన నిహారిక.ఆ త‌ర్వాత “హ్యాపీ వెడ్డింగ్” చిత్రంలో న‌టించిన‌ప్ప‌టికీ ఇది ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని సాధింలేక‌ పోయింది. ఈమధ్యనే నిశ్చితార్థం కూడా జరుపుకుని పెళ్ళి పీటలెక్కడానికి సిద్ధమౌతున్న ఈ ముద్దుగుమ్మ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

డిసెంబర్ 18న 1993 సంవత్సరంలో జన్మించిన నిహారిక తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత, టీవీ యాంకర్, అయిన మెగా బ్రదర్ నాగేంద్రబాబు కూతురన్న విషయం అందరికీ తెలిసిందే. నిహారిక తాను నటి కాకముందు ‘ఢీ జూనియర్స్’ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. ఆ తర్వాత ‘ముద్దపప్పు ఆవకాయ’ అనే షార్ట్ ఫిలిమ్ లో హీరోయిన్ గా నటించి మెట్రో సిటీలో పెరిగిన ఈ తరం అమ్మాయిలా జీన్ ప్యాంటులు వేసుకొనే మోడ్రన్ గర్ల్ పాత్రలో నీహారిక ఒదిగిపోయింది. ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో రిలీజ్ అయి.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

అలాగే జూన్ 2016 లో విడుదలైన ‘ఒక మనసు’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక పక్కింటి అమ్మాయిలా చుడీదార్లు, చీరలు కట్టి మెప్పించి అన్ని రకాల పాత్రలు చేయగలనని నిరూపించుకొన్నది. ఆ తర్వాత ఆమె నటించిన ‘సూర్యాకాంతం’ చిత్రం కూడా ఆశించినంతగా విజయం సాధించలేదు. నిహారిక ఓ తమిళ సినిమాలో కూడ నటించింది. సోషల్ మీడియాలో నిహారిక పెళ్ళిపై రకరకాల రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఆమె చివరగా నటించిన చిత్రం ‘సైరా’ ఆమె పెదనాన్న చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమాలో నిహారిక ఓ బోయ పిల్ల పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సినిమాలకు కొంత విరామం ఇచ్చిన నిహారికకు ఈమధ్యనే గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైత‌న్య‌తో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే నిహారిక పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Radha: ఆ పాటకు చిరుతో డాన్స్ చేయాలంటే కష్టంగా అనిపించింది: రాధా

Published

on

Radha: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రాధా ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినటువంటి రాధ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే బుల్లితెరపై నీతోనే డాన్స్ కార్యక్రమానికి ఈమె జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి రాధా ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. మీ మొదటి సినిమా చిరంజీవి గారితో ఏది అనే ప్రశ్న ఆలీ అడగడంతో రాధా సమాధానం చెబుతూ చిరంజీవి గారితో కలిసి గుండా అనే సినిమాలో మొదటిసారి నటించానని తెలిపారు.

నిజాయితీపరులు..

Advertisement

ఇక ఆయనతోపాటు నేను సమానంగా డాన్స్ చేసేదాన్ని నిర్మాతల డబ్బు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతోనే సింగిల్ టేక్ లో ఎలాంటి స్టెప్స్ అయినా కూడా చేసేస్తానని తెలిపారు. కానీ యముడికి మొగుడు సినిమాలో అందం హిందోళం అధరం తాంబూలం పాటకి మాత్రం చిరంజీవితో పాటు డ్యాన్స్ చేయడం కష్టంగా అనిపించినట్లు రాధ గుర్తు చేసుకుంది. చిరంజీవి మంచివారు మాత్రమే కాదు నిజాయితీపరులు. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ డ్యాన్స్ విషయంలో పోటీ ఉండేదని ఆ పోటీ ఉన్నప్పుడే సినిమా కూడా అద్భుతంగా వస్తుందంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: జరగండి పాట కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా.. అయినా ఫలితం లేకుండా పోయిందా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమా తర్వాత బుచ్చిబాబు అనంతరం సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలలో రామ్ చరణ్ బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి జరగండి జరగండి అనే పాటను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రాసినటువంటి ఈ పాటను విడుదల చేయగా ఈ పాటకు అనుకున్న స్థాయిలో వ్యూస్ రాలేదని చెప్పాలి. ఈ పాట పట్ల మెగా ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

18 కోట్లు ఖర్చు..

రామ్ చరణ్ వంటి స్టార్ హీరోకి పడాల్సిన పాట కాదు అంటూ కామెంట్లో పెడుతున్నారు. ఇక ఈ పాట కోసం ఏకంగా 18 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయిలో ఖర్చు చేసిన సినిమాలోని ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Rashmika: మై డార్లింగ్.. పార్టీ కావాలంటున్న రష్మిక.. రౌడీ హీరో రిప్లై ఇదే?

Published

on

Rashmika: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే రష్మిక ఒకవైపు సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే ఈమె నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఈ వార్తలు గురించి మాత్రం ఈమె స్పందించడం లేదు కానీ తరచూ వీరిద్దరూ వెకేషన్ లోకి వెళ్లడం ఒకే చోటే కలిసి పార్టీలు చేసుకోవడం వంటి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఇదిలా ఉండగా తాజాగా మై డార్లింగ్ అంటూ విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ వీడియోని రష్మిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

Advertisement

ఆల్ ది బెస్ట్ మై లవ్..
మై డార్లింగ్స్ విజయ్ దేవరకొండ పరశురామ్ కు నా బెస్ట్ విషెస్. ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోయే ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీరు కచ్చితంగా హిట్ కొట్టబోతున్నారు నాకు పార్టీ కావాలి ఆల్ ద బెస్ట్ మై లవ్ మృణాల్ ఠాకూర్ అంటూ ఈ సందర్భంగా ఈమె చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!