Connect with us

Featured

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నందుకు గంగవ్వకు ఎంతిస్తున్నారో తెలుసా.?!

Published

on

బుల్లితెరపై మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 4 సందడి మొదలైన సంగతి తెలిసిందే.! అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ షో నడిచినన్ని రోజులు ఎవరికీ కాంటాక్ట్ లేకుండా ఉండాలి కాబట్టి వచ్చే కంటెస్టెంట్స్ కూడా మాములుగా తీసుకునే అమౌంట్ కి డబల్ తీసుకుంటారు. బిగ్ బాస్ కూడా అలాగే చెల్లిస్తుంది. అయితే ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా వచ్చిన వాళ్ళు రోజుకి ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వాస్తవానికి బిగ్ బాస్ లో పాల్గొనే వాళ్ళకి మినిమమ్ రోజుకి 10 వేల నుంచి పేమెంట్ ఉంటుంది. ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్లకి ఎక్కువ ఇస్తారు. తక్కువ ఫేమ్ ఉన్న వాళ్లకి తక్కువగా ఇస్తారు. కానీ మినిమమ్ 10 వేలు ఉంటుంది.

అయితే ఈసారి సీజన్ 4షోలో ఉన్న వాళ్లలో ఎవరు అంత ఫేమస్ కాదు.. యాంకర్ లాస్య అందరికి తెలుసు. లాస్యకి రోజుకి 50 వేలకు పైగానే ఇస్తున్నారు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ కి కూడా 40 వేలకు పైగా ఇస్తున్నారు. హీరోయిన్ మోనాల్ గజ్జర్ కి కూడా 40 వేలకు పైగా ఇస్తున్నారు. డైరెక్టర్ సూర్యకిరణ్ కి 10 వేలకు పైగా ఇస్తున్నారు. అభిజిత్ కి 20 వేలకి పైగా ఇస్తున్నారు. జోర్దార్ యాంకర్ సుజాతకి 10 వేలకి పైగా ఇస్తున్నారు. మెహబూబ్ దిల్‌సే కి 10 వేలకి పైగా ఇస్తున్నారు. టీవీ 9 యాంకర్ దేవికి 20 వేలకి పైగా ఇస్తున్నారు. దేత్తడి హారికకి 25 వేలకి పైగా ఇస్తున్నారు. టీవీ యాక్టర్ సయ్యద్ సోహైల్ కి 10 వేలకి పైగా ఇస్తున్నారు. యాంకర్ అరియానా గ్లోరీకి 10 వేలకి పైగా ఇస్తున్నారు. కరాటే కళ్యాణికి 25 వేలకి పైగా ఇస్తున్నారు. సింగర్ నోయల్ కి 40 వేలకి పైగా ఇస్తున్నారు. మోడల్ దివికి 10 వేలకి పైగా ఇస్తున్నారు. అఖిల్ సార్థక్ కి 10 వేలకి పైగా ఇస్తున్నారు. అలాగే ఈమధ్య వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ కుమార్ సాయికి 10 వేలకి పైగా ఇస్తున్నట్టు తాజా సమాచారం. వీళ్లందరికన్నా ముఖ్యంగా హోస్ట్ చేసే కింగ్ నాగార్జునకు షో మొత్తానికి కలిపి 8 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిసింది.

అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు సంభందించిన ట్విస్ట్ ఏమిటంటే.. ఇంత వరకు ఏ భాషలోను బిగ్ బాస్ సీజన్స్ లో కనిపించని సంఘటన తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో జరగడం బుల్లితెర ప్రేక్షకులకు ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. అదేమిటంటే.. బిగ్ బాస్ అంటేనే అందమైన ముద్దుగుమ్మలు.. యంగ్ & డైనమిక్ కుర్రాళ్ళ తో సరదాలు.. సందడి.. రొమాన్స్..కాంట్రవర్సీలు.. అని అందరూ ఫిక్సైపోయారు. అలాంటి బిగ్ బాస్ లో మొదటి సారిగా 60 ఏళ్ళ వయసున్న ఒక పల్లెటూరు వ్యక్తి, చదువుకోని గంగవ్వను బిగ్ బాస్ సీజన్ 4లోకి తీసుకోవడం పెద్ద ప్రయోగమని చెప్పాలి. అంతేకాకుండా ఈ షోలో గంగవ్వ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలామంది గంగవ్వ కోసమే బిగ్ బాస్ చూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.! మొదటి వారమే గంగవ్వకు 2 కోట్లకు పైగా ఓట్లు వచ్చాయంటే ఆమెకున్న గుర్తింపు ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.

అందుకే ప్రతి ఒక్కరూ గంగవ్వకు మద్దతు ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు. గంగవ్వ వలెనే బిగ్ బాస్ షో నిర్వాహకులు మంచి లాభాలను పొందుతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఆమెకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని గంగవ్వ కు బిగ్ బాస్ లో వారానికి 3 లక్షల పారితోషికం ఇస్తున్నారట. బిగ్ బాస్ షోలో పాల్గొంటూ సంపాదించిన ఆ డబ్బుతో సొంత ఇల్లు కట్టుకోవాలని గంగవ్వ కళలు కంటుందంట. మరి మనం కూడా గంగవ్వ ఆశ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!