Geethakrishna: పూటకో సెలబ్రిటీ గురించి మాట్లాడుతూ యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తూ నిత్యం వైరల్ అవుతున్న డైరెక్టర్ గీతా కృష్ణ తాజాగా మరో సెలబ్రిటి గురించి మాట్లాడారు. ఈ సారి హీరో లు హీరోయిన్లను వదిలేసి నిర్మాత దిల్ రాజు గురించి మాట్లాడాడు. దిల్ రాజు ఇంట వారసుడు రావడం, మరో వైపు దిల్ రాజు తమిళ హీరో విజయ తో కలిసి వారసుడు అనే సినిమా తీస్తుండడం గురించి స్పందించారు.

కొత్త బంగారు లోకం సినిమా పేరు ఎలా ఉందంటూ…
దిల్ రాజు భార్య అనిత చనిపోయాక బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోవడంతో కూతురు హర్షిత తన తండ్రి ఇలా ఒంటరిగా ఉండకూడదని భావించి మళ్ళీ పెళ్ళికి ఒప్పించారు. తేజస్విని తో గతేడాది వివాహం చేసారు. ఇక దిల్ రాజు కి తేజస్వినికి దాదాపు 18 ఏళ్ల వయసు వెత్యాసం ఉంది. ఇక తాజాగా వీరికి పండంటి బాబు పుట్టడంతో మరో సారి వార్తల్లో నిలిచారు. ఇక ఆయనకు వారసుడు రావడం, ఇక ఆయన తమిళ, తెలుగు భాషలలో వారసుడు అనే టైటిల్ తో సినిమా తీస్తుండడం గురించి గీతాకృష్ణ స్పందించారు.

భార్య చనిపోయి బాధలో ఉన్న ఆయనకు మళ్ళీ ఇలా అన్ని గుడ్ న్యూసులు ఒకేసారి రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ దిల్ రాజు ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలకు నడుమ మధ్యవర్తిలా ఉండేవారు, ఆ తరువాత నిజాం డిస్ట్రిబ్యూషన్, అలా నిర్మాతగా ఎదిగారని చెప్పారు. కొత్త బంగారు లోకం సినిమా సమయంలో నేను కనిపించగా నన్ను సినిమా పేరు ఎలా ఉండని అడిగారు. కొత్త ఎందుకు బంగారు లోకం బాగుంది కదా అని అంటే న్యూమరాలజీ సెంటిమెంట్ ఉందని చెప్పారట. ఇక తన జడ్జిమెంట్ బాగుంటుంది కాబట్టే నిర్మాతగా సక్సెస్ అయ్యాడని గీతా కృష్ణ కామెంట్స్ చేసారు.

































