Ghattamaneni Adhisheshagirirao : ఎటువంటి ప్రయోగాలకైనా ముందుండి మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు తెరకు కొత్తరకం సినిమాలను పరిచయం చేసిన ఆయన ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఆంధ్ర జేమ్స్ బాండ్ గా నిలిచిన ఆయన నేడు అశేష తెలుగు అభిమానులను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అయన నవంబర్ 15న మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల మరణించారు. మహేష్ బాబు కుటుంబంలో వరుసగా విషాదాలు నెలకొన్నాయి. మొదట సోదరుడు రమేష్ బాబు మరణించడం, ఆ తరువాత ఇటీవలే తల్లి ఇందిర గారు మరణించడం, ఆవిడ మరణించిన కొద్ది రోజులకే కృష్ణ గారు మరణించడం తో మహేష్ ఒంటరి అయిపోయారు.

విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నాక అమ్మ, వదిన రియాక్షన్ అదే…
ఇక కృష్ణ గారి భార్యగా ఇందిరా దేవి గారు బయట ఎక్కువగా కనిపించలేదు. కేవలం కృష్ణ గారి భార్యగా విజయనిర్మల గారు మీడియా ముందు కనబడేవారు. పెళ్ళై రమేష్ బాబు పుట్టిన తరువాత కృష్ణ గారు విజయ నిర్మల గారిని వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకుండా రెండో వివాహాన్ని ఇందిరా దేవి గారు అంగీకరించడంలో కృష్ణ గారి తమ్ముడు ఆదిశేషగిరి రావు గారి పాత్ర ఎంతైనా ఉంది. ఇక ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ కృష్ణ గారి వ్యక్తిగత విషయంగానే విజయనిర్మల తో వారి పెళ్లిని చూసామని చెప్పారు.

కుటుంబంలో అయితే మొదట అమ్మ కొంత వ్యతిరేకత వ్యక్తం చేసినా చివరికి సర్దుకుని వదినకు నచ్చజెప్పిందని ఆదిశేషగిరి గారు చెప్పారు. వదినకు అమ్మ నీ స్థానం ఎక్కడికీ పోదు నీ బిడ్డలకు అన్యాయం జరగదు ఆ మాట మీదనే ఈ పెళ్లిని ఒప్పుకున్నట్లు చెప్పడంతో వదిన కూడా అంగీకరించారని, గొడవ పడితే కుటుంబంలో అనవసరంగా కలతలు వస్తాయని అలోచించి వదిన గొప్ప నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు.


































