Free Ration: కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులకు గురైన ప్రజలను ఆహార భద్రత విషయంలో ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాన్ యోజన అనే పథకం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాంగంగానే రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉచితంగా బియ్యం సరఫరా చేస్తూ వస్తోంది.

ఈ పథకం గత సంవత్సరం నవంబర్ లోనే ముగించాల్సి ఉండగా.. దానిని మరో ఐదు నెలలు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంటే ఈ సంవత్సరం మార్చి 31 వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు.

దీనిలో భాగంగానే ఏపీ ప్రభుత్వ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా మరో శుభవార్తను అందించింది. జనవరి 18 నుంచి ప్రజలందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేయనునట్లు పేర్కొంది.
ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ
సాధారణంగా జవనరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉచిత రేషన్ బియ్యం సరఫరా జరగాలి. కానీ బియ్యం నిల్వలు లేనందును డిసెంబర్ నెలలో పంపిణీ చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు తాజాగా ఈ ప్రకటన చేసింది. డిసెంబర్, జనవరి నెలలకు సరిపడా.. ఒకొక్కరికీ 10 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఉచిత బియ్యం పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని గిరాజా శంకర్ సూచనలు చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఒకొక్కరికీ 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు.



























