ఈయన చేసింది తక్కువ సినిమాలే అయినా… తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. దర్శకుడిగానే కాకుండా… రచయితగా, నిర్మాతగా, పంపిణీదారుడిగా, ఆడియో కంపెనీ అధినేతగా, ప్రదర్శనకారుడిగా ఆయన పరిశ్రమతో విడదీయలేని అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్కి వీరాభిమాని అయిన చౌదరి, ఆయన స్ఫూర్తితోనే చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కృష్ణాజిల్లా, గుడివాడలో 23 మే 1965లో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన వైవీయస్ చౌదరికి చిన్నప్పట్నుంచే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. చదువుకొనే వయసులోనే ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.
ఆ తర్వాత అందరి సినిమాలు చూస్తూ… వాటిలో లోటుపాట్లు, మంచి చెడులు…. ఏ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందో స్నేహితుల దగ్గర చెప్పేవాడట. ఇంజినీరింగ్ చదువుకోవడం కోసం మద్రాసు వెళ్లిన ఆయన, సినిమాలపై ఇష్టంతో చదువుని పక్కనపెట్టి అక్కడే ఎడిటింగ్ విభాగంలో చేరారు. ఆ తర్వాత సహాయ దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించారు. ఎన్టీఆర్తో పలు చిత్రాలు తీసి విజయాలు అందుకొన్న కె.రాఘవేంద్రరావు అంటే చౌదరికి ఎంతో అభిమానం. దాంతో ఆయన ఎలాగైనా రాఘవేంద్రరావు దగ్గర సహాయ దర్శకుడిగా చేరాలనుకొన్నారు. కానీ అప్పటికే ఆయన దగ్గర చాలామంది ఉండటంతో కుదరదని చెప్పారు. అయినా పట్టు వదలకుండా వారం రోజులపాటు ఆయన ఇంటి దగ్గరే నిలబడి సహాయ దర్శకుడిగా అవకాశం సంపాదించారు.
అలా ‘పట్టాభిషేకం’, ‘కలియుగ పాండవులు’, ‘సాహస సామ్రాట్’, ‘అగ్నిపుత్రుడు’, ‘దొంగరాముడు’, ‘జానకిరాముడు’, ‘రుద్రనేత్ర’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రాలకి పనిచేశారు చౌదరి. ఆ తర్వాత వైజయంతీ మూవీస్లో చేరి ‘అశ్వమేథం’, ‘గోవిందా గోవిందా’ చిత్రాలకి కో డైరెక్టరుగా పనిచేశారు. ‘క్రిమినల్’, ‘గులాబి’, ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రాల తర్వాత నాగార్జున అవకాశం ఇవ్వడంతో ఆయన నిర్మాణంలో ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చిత్రం చేశారు చౌదరి. ఒక ముఖ్యపాత్రలో ఏఎన్నార్… ప్రధాన పాత్రధారులుగా కొత్తవాళ్లతో తెరకెక్కిన ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత నాగార్జునే ‘సీతారామరాజు’ చేసే అవకాశం ఇచ్చారు. అది కూడా విజయవంతమైంది.
ఆ చిత్రం తర్వాత మహేష్బాబుతో ‘యువరాజు’ చేశాడు. కానీ అది పరాజయం పాలైంది. ఆ ఫలితం చూసి, నిర్మాతలెవ్వరూ సినిమాలు చేయడానికి ముందుకు రాకపోవడంతో ‘బొమ్మరిల్లు వారి’ పేరుతో సొంత నిర్మాణ సంస్థని స్థాపించి స్వీయ దర్శకత్వంలో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రం చేశారు. విజయం అందుకొన్నారు. ఆ తర్వాత చేసిన ‘సీతయ్య’, ‘దేవదాసు’ చిత్రాలతోనూ తనదైన ప్రత్యేకతని ప్రదర్శించిన వైవీఎస్ చౌదరికి ‘ఒక్కమగాడు’, ‘సలీమ్’ చిత్రాలు చేదు ఫలితాల్ని ఇచ్చాయి. నిర్మాతగా చేసిన ‘నిప్పు’ కూడా పరాజయాన్నే మిగిల్చింది. సాయిధరమ్ తేజ్ని ‘రేయ్’తో తెరకు పరిచయం చేశారు. కానీ ఆ చిత్రం కూడా పరాజయాన్నే మిగిల్చింది. అప్పట్నుంచి సినిమాలకి దూరంగా ఉంటున్నారు వైవీయస్ చౌదరి.
త్వరలోనే ఆయన కొత్త సినిమా కోసం మెగాఫోన్ చేతపట్టబోతున్నారని సమాచారం. వెంకట్, చాందిని, చందు, ఆదిత్య ఓం, అంకిత, రామ్, ఇలియానా, సాయిధరమ్ తేజ్, సయామీఖేర్ తదితర నటుల్ని తెరకు పరిచయం చేసింది చౌదరినే. ‘నిన్నే పెళ్లాడతా’ సమయంలో అందులో ఒక కీలక పాత్రలో నటించిన గీతని ప్రేమించి, ఆమె తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకొన్నారు చౌదరి. వీరికి అమ్మాయిలు యుక్త చౌదరి, ఏక్తా చౌదరి ఉన్నారు.
ఈరోజు వైవీయస్ చౌదరి గారి పుట్టినరోజు.. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ..💐💐💐
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.