Connect with us

Featured

హీరో రాజేష్ చనిపోతే ఎల్ఐసి ఏజెంట్ గా మారి ఎన్ని కష్టాలు పడుతూ కూతుర్ని హీరోయిన్ చేసిందో తెలుసా ఐశ్వర్య రాజేష్ తల్లి.. !!

Published

on

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో సువర్ణ పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేష్ గొప్ప నటీమణిగా పేరు తెచ్చుకున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఆమె రక్తంలోనే నటన ఉంది. ఐశ్వర్య తండ్రి పేరు రాజేష్ కాగా అతను మల్లెమొగ్గలు, రెండు జెళ్ళ సీత, ఆనంద భైరవి వంటి చిత్రాల్లో నటించి మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నారు. ఐశ్వర్య తాతయ్య అమర్నాథ్ కూడా నటనారంగంలో మంచి పేరు తెచ్చుకున్న నటుడే. అమర్నాథ్ నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ మేనత్త శ్రీలక్ష్మి 500 పైచిలుకు తెలుగు, తమిళ కన్నడ సినిమాల్లో హాస్యనటి గా నటించి కడుపుబ్బా నవ్వించారు. జంధ్యాల సినిమాల్లో కూడా ఆమె నటించి చాలా హాస్యాస్పదమైన డైలాగులను తనదైన శైలిలో చెప్పి ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.

అప్పట్లో ఐశ్వర్య తండ్రి రాజేష్ హైదరాబాద్ నగరం నుండి చెన్నై కి మకాం మార్చారు. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు ఐశ్వర్య రాజేష్ చెన్నైలోనే తన జీవితాన్ని గడుపుతున్నారు. తండ్రి హీరోగా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఐశ్వర్యా రాజేష్ చిన్నతనం నుండే ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేవారు. తన తండ్రి రాజేష్ ఒక్క సినిమాలో నటిస్తే వచ్చిన డబ్బులు అన్నీ కూడా దానధర్మాలకు ఇవ్వాల్సి వచ్చేది. పొద్దస్తమానం ఎవరో ఒకరు వచ్చి రాజేష్ ను దానం చేయమని అడిగేవారట. వచ్చిన వారిని కాదనలేక రాజేష్ ఆర్థిక సహాయం చేసేవారట. ఐశ్వర్య తల్లి కూడా అతి మంచి వ్యక్తి కావడంతో సంపాదించినవి కొన్ని డబ్బులు అయినా సరే వాటిని కూడా దానం చేసేవారట. ఐశ్వర్య తల్లిదండ్రులు ఎంత అతి మంచివారంటే… లక్షల రూపాయలకు షూరిటీ కూడా ఉండి ఇతరులకు డబ్బులు ఇప్పించేవారట. ఇలా ముందు వెనుక ఆలోచించకుండా అందరికీ మంచి చేసి చివరికి కూడబెట్టిన సొమ్మునంతా పోగొట్టుకున్నారు.

అంతేకాకుండా రాజేష్ తాగుడుకు అలవాటుపడి తన ఆరోగ్య మొత్తం సర్వనాశనం చేసుకున్నారు. దాంతో ఐశ్వర్య తో పాటు తన ముగ్గురు అన్నయ్యలను కూడా పోషించడానికి రాజేష్ భార్య ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేసేవారు. ఆర్థిక భారంతో మానసికంగా, శారీరకంగా బాగా కృశించిపోయినప్పటికీ తన భర్తని బతికించుకోవడం కోసం ఖరీదైన వైద్యం చేయించారు. కానీ రాజేష్ లివర్ పూర్తిగా చెడిపోవడంతో అతను చనిపోయారు. అప్పటికి ఐశ్వర్య రాజేశ్ వయసు కేవలం 8 సంవత్సరాలే. అయితే అప్పటికి వాళ్లకి ఒక ప్లాట్ ఉండేది కానీ షూరిటీ తీసుకున్న వారంతా మొహం చాటేయడంతో అప్పులు ఇచ్చినవారు ఐశ్వర్య రాజేష్ కుటుంబానికి ఉన్న ఒక్కగానొక్క ప్లాట్ ని కూడా ఆక్రమించుకున్నారు. దాంతో చివరికి అద్దె ఇంట్లో ఉంటూ తల దాచుకోవడం ప్రారంభించారు.

ఒక రోజు తిని ఒకరోజు తినక ఎంతో కాయకష్టం చేసిన రాజేష్ భార్య తన పిల్లలను పెంచి పెద్ద చేసి మంచి చదువులు చదివించారు. కానీ దురదృష్టవశాత్తు చేతికి అందివచ్చిన ఇద్దరు పెద్ద కుమారులు చనిపోయారు. ఆ దుర్ఘటన తో ఐశ్వర్య రాజేష్ కుటుంబం మళ్లీ దయనీయమైన పరిస్థితికి వచ్చింది. ఇద్దరు కుమారులు చనిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఐశ్వర్య రాజేష్ తల్లి చాలా రోజుల వరకు మంచానికి పరిమితమయ్యారు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ ఐశ్వర్య పైనే పడగా ఆమె సీరియళ్లలో నటించడానికి సిద్ధపడ్డారు. సీరియళ్లలో పొద్దున ఆరింటికి నుండి రాత్రి 11 గంటల వరకు నటించినందుకుగాను ఆమెకు రూ. 500 మాత్రమే ఇచ్చేవారట. కానీ పూట గడవడానికి ఏ దిక్కు లేక సీరియల్లోనే నటించేవారట. ఆ క్రమంలోనే సినిమాల్లో నటిస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని తెలుసుకున్న ఐశ్వర్య మూవీ ఆఫర్స్ కోసం ప్రయత్నించారు కానీ ప్రతి ఒక్కరూ ఆమెను దారుణంగా అవమానించారు. కలరు బాగోలేదని, భాష బాగోలేదని మొహం మీదే నోటికొచ్చినట్టు తిట్టేవారట. కానీ ఆ అవమానాలను తాను లెక్కచేయకుండా మొండి పట్టుదలతో ముందడుగు వేసి ప్రస్తుతం హీరోయిన్ స్థాయికి ఎదిగారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!