Connect with us

Featured

ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన కామెంట్స్ చేసిన సినీనటి కుష్బూ !

Published

on

చెప్ప‌ద‌ల‌చుకున్న విషయాన్ని సుత్తి కొట్టకుండా సూటిగా, స్ప‌ష్టంగా చెప్పడం ప్ర‌ముఖ సినీ న‌టి ఖుష్బూ ధైర్యానికి నిదర్శనం. తెలుగు సినీ న‌టిగా ఆమె టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుప‌రిచితురాలే. ఈమధ్య త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కాంగ్రెస్ త‌ర‌పున ఆమె చాలా యాక్టీవ్‌ గా ఉంటున్నారు. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూ.. సంచలన కామెంట్స్ చేస్తూ.. ఒక్కొక్కసారి వివాదస్పదమైన అంశాలతో తనదైన శైలిలో ముందుంటూ ఎక్కువగా సోషల్ మీడియాలో కనబడుతున్నారు.

తాజాగా భారత ప్ర‌ధాని నరేంద్ర మోడీపై త‌నదైన శైలిలో వెట‌కారాన్ని జోడించి సినీనటి ఖుష్బూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఖుష్బూ చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. రాముడి కంటే మోడీ పెద్ద‌వాడైపోయార‌ంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఖుష్బూ షేర్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అయోధ్య రాముని ఆలయ నిర్మాణ శంకుస్థాపన బ్రహ్మాండంగా జరిగింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా తక్కువ మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వందల సంవత్సరాల నిరీక్షణ ఫలించిందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలియ జేశారు. ఆలయ నిర్మాణ శంకుస్థాపన జరగడంతో తమ కల నిజమైనందుకూ దేశ ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోడీని దేశంలోనే యుగ పురుషుడిగా వర్ణిస్తూ మోడీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం హిందువుల కల నెరవేరుస్తున్న మోడీని హీరోగా పిలుస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ భారత ప్రధాని నరేంద్ర మోడీఫై సంచలన కామెంట్స్ చేయడం హాట్ టాపికైంది. బీజేపీ ఎంపీ శోభ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘బాల రాముడి చేతిని అందిపుచ్చుకొని మందిరం వైపు మోడీ నడిపిస్తున్న చిత్రం’ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి తన ప్రియమైన రాజును ఇంటికి తిరిగి స్వాగతించడానికి అయోధ్య సిద్ధంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఆ చిత్రాన్ని గమనించిన కుష్బూ ‘వావ్.. ఇప్పుడు దేవుడైన రాముడి కంటే మోడీ పెద్దవారై పోయారన్నమాట. కలియుగ ప్రభావం మరి..’ అనే భావం వచ్చేలా వెటకారంగా సెటైర్ వేసింది. దీంతో ఒక్కసారిగా నరేంద్ర మోడీ ఫ్యాన్స్ ఖుష్బూఫై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!