Connect with us

Featured

బీర్ ఎంజాయ్ చేస్తూ తాగుతాం…మీకెందుకు…!!

Published

on

సినిమా ఇండస్ట్రీలో తాగడం అనేది ఓ ఫ్యాషన్. తాగకపోతే తప్పుగా అనుకుంటారేమో అన్నట్లు ఉంటుంది వ్యవహారం. ఈవెంట్ ఏదైనా, పార్టీ ఏదైనా మద్యం లేనిదే పని జరగదు. చెప్పాలంటే ఇండస్ట్రీలో దాదాపు 90 శాతం మంది మద్యం తాగుతారనేది టాక్. అయితే కొందరు చెప్పుకుంటారు. మరికొందరు దాస్తారు. గతంలో సావిత్రి, సిల్క్ స్మిత లాంటి వాళ్ళు మద్యానికి బానిస అయి జీవితాలను, ఆయుష్షును పోగొట్టుకున్నారు. నిన్నటి తరానికి వస్తే మనీషా కొయిరాలా వంటి వారు కూడా ఈ తాగుడు కి బానిసై కాన్సర్ లాంటి వ్యాధికి కూడా గురయ్యారు.

కానీ అప్పట్లో మీడియా కంట పడితే తప్ప తాగిన విషయం బయటకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఆలా కాదు బాహాటంగానే ఈ విషయాన్నీ బయటకు చెప్తున్నారు హీరోయిన్స్. ఆలా ఫుల్లుగా తాగే అలవాటు ఉంది మీడియా ముఖంగా చెప్తున్న హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం.

ఈ లిస్ట్ లో మొదటగా చెప్పుకోవాల్సింది మాత్రం హీరినే శృతి హస్సన్ గురించే. కమల్ హస్సన్ గారాల పట్టి శ్రుతి హాసన్ తనకున్న తాగుడు అలవాటు గురించి చెప్తూ మ‌ద్యం మాన‌లేక కెరీర్ ప‌రంగా కూడా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాన‌ని చెప్పింది. ఇలా బాహాటంగా శ్రుతిహాస‌న్ త‌న బ‌ల‌హీన‌త‌ను బ‌య‌ట‌పెట్ట‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. అయితే ఇప్పుడు తాను మందుకు చాలా దూరంగా ఉన్నాన‌ని, ఇక‌పై మ‌ద్యం జోలికి వెళ్ల‌న‌ని కూడా చెప్పింది.

ఇక ఇదే దోవలో మరొక హీరోయిన్ వీణ… తమిళ నటి అయిన వీణ తాను ఫుల్లుగా మద్యం తాగుతాను అని బల్లగుద్ది మరీ చెప్తోంది. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీణ మాట్లాడుతూ తెగ ఊగిపోయారు. ‘నాకు తాగుడు అలవాటు ఉందన్న విషయాన్ని బయటపెట్టడానికి నేనెందుకు భయపడాలి? అదేమన్నా క్షమించరాని నేరమా? నేను బీర్ తాగితే నేను చాలా మాట్లాడేస్తాను. నేను ఈ విషయాన్ని గతంలో కూడా వెల్లడించాను. చాలా మంది యంగ్‌స్టర్స్‌కి కూడా అలవాటు ఉంటుంది కదా. ఈ అలవాటు వల్ల ఎవరికీ హాని ఉండదు. ఇది నా వ్యక్తిగతం. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్లు చేస్తుంది తప్పో కాదో ఓసారి సరిచూసుకోవాలి’ అంటూ హితబోధ కూడా చేస్తుంది.

ఇక ‘పటాస్’ షో తో పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి తన యాంకరింగుతో పాటు ఇటీవల బిగ్ బాస్ లోను సందడి చేసి ఈ తరం యువతను ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మొన్న ఆ మధ్య పటాస్ షో నుంచి బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించిన శ్రీముఖి… తాజాగా అభిమానులతో లైవ్ చాటింగ్ లో తన వ్యక్తి గత జీవితానికి సంభదించినా అనేక విషయాలను చెప్తూ మీరు మందు కొడతారా? అనే ప్రశ్నకు శ్రీముఖి మొమమాటం లేకుండా సమాధానం ఇచ్చారు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే… అకేషనల్లీ మందు కొడతాను. ఎక్కువగా వైన్ ప్రిఫర్ చేస్తాను. అది ఆరోగ్యం కూడా..” అంటూ నిజం ఒప్పుకున్నారు శ్రీముఖి.

ఇక బాలీవుడ్ లో అయితే ఈ అలవాటు అందరికి ఉంటుంది. కానీ బయటకు చెప్పేవాళ్ళు ఉండరు. కానీ పరిణీతి చోప్రా మాత్రం అలా కాదు. తాను మొదటి సారి మందు తాగినప్పుడు జరిగిన సీన్ తో సహా అన్ని చెప్పేసింది, సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు మద్యం అలవాటు లేదట.అసలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత కూడా ఓ అయిదారు సినిమాలు చేసేదాకా అసలు ఈ హీరోయిన్ మద్యం జోలికే వెళ్ళలేదట. ఇప్పుడైతే పరిణీతి మద్యాన్ని హ్యాంగ్ అవుట్స్ లో తాగుతోందట. ఇక తొలిసారి మద్యం తాగినప్పుడు, తొలిసారి మత్తులో మునిగినప్పుడు వెరైటి పనులు చేసానని, తన మీద తనకు కంట్రోల్ లేని తరుణంలో కూడా బాగా ఎంజాయ్ చేసానని, రాత్రంతా డ్యాన్స్ చేసి అందరికి ముద్దులు కూడా పెట్టానని పరినీతి తన మద్యం గ్నాపకాల్ని బయటపెట్టింది.

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మహేష్ భట్ కుమార్తె, మాజీ హీరోయిన్ పూజాభట్ మాట్లాడుతూ తాను మద్యానికి బానిసనయ్యానని, మద్యంతాగే అలవాటున్న మహిళలు చాలామంది దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తారని, తమకు అలవాటు లేదని బయటకు చెబుతారని అన్నారు. ఇవండీ మన హీరోయిన్స్ మందు కొట్టి బయటకు కక్కేస్తున్న నిజాలు…

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!