Connect with us

Featured

సినిమాలను వదిలేసి టాప్ కంపెనీలలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగు హీరోయిన్స్ !!

Published

on

సినిమా..ఏ భాషలో అయినా ఇదొక రంగుల ప్రపంచమే. ఒక్కసారి ఈ ప్రపంచం లోకి అడుగుపెట్టాక బయటకు వచ్చే దారి ఉండదు. సెలబ్రిటీ లైఫ్ స్టైల్ చుసిన వారు ఎవ్వరైనా అలాంటి జీవితమే ఎల్లప్పుడూ కోరుకుంటారు. ముక్యంగా హీరోయిన్స్ అయితే ఆ కలల ప్రపంచం లేకుండా జీవించలేరు. కానీ హీరోయిన్స్ లైఫ్ మహా అయితే ఒక పదేళ్లు ఇండస్ట్రీ లో ..అంత కన్నా అంటే అక్క వదిన అమ్మ పాత్రలు చేయాలి. పెళ్లయిందా ఇంకా నటనకు ఫుల్ స్టాప్ పెట్టి సంసారం జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. కొంత మంది హీరోయిన్స్ మాత్రం భర్తలతో బిజినెస్ లు లేదంటే వారికి నచ్చిన ఏదైనా ప్రొఫషన్ కి మారిపోతారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే హీరోయిన్స్ మాత్రం అలా కాదు. నటనలో స్టార్ డం చూసి ఆ తర్వాత పెళ్ళై పిల్లలు ఉన్న కూడా భర్త పైన లేదంటే కుటుంబం పైన ఆధారపడకుండా తమకంటూ మరొక కొత్త ఐడెంటిటీ ని సృష్టించుకొని ప్రపంచమే తమను మెచ్చుకునేలా దీటుగా మరొక రంగంలో రాణిస్తున్నారు. టాలీవుడ్ నుండి అలా దూరం అయ్యి వరల్డ్ బెస్ట్ కంపెనీ లలో కీలక బాధ్యతలు తమ భుజాన వేస్తూ తాము సినిమాల్లో నటించే బొమ్మలము మాత్రమే కాదు చదువు ఇచ్చిన జ్ఞానం తో ప్రపంచాన్నే జయించగలం అని నిరూపిస్తున్నారు. ఆలా సినిమా రంగం వదిలేసి కెలక ఉద్యోగాలు చేస్తున్న హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం.

Actress Manya

మొదటగా మాన్య. నాగార్జున హరికృష చెల్లిగా సీతారామరాజు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది మాన్య. మాయదారి మైసమ్మ పాటతో మంచి ఫాన్స్ ని కూడా సంపాదించుకుంది ఈ రెండు సినిమాల హిట్ తర్వాత తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో మొత్తంగా 41 సినిమాల్లో నటించింది. పెళ్లి చేసుకొని ప్రస్తుతం న్యూ యార్క్ లో ఉంటున్న మాన్య నాలుగేళ్ళ కూతురికి అమ్మ కూడా. కానీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినా బ్యాంకింగ్ సంస్థ అయినా jp morgan chase కంపెనీ లో కీలక బాధ్యతల్లో ఉంది. నటన నుండి నేరుగా ఫైనాన్స్ రంగం లో స్థిరపడిందిమాన్య. ప్రస్తుతం మాన్య ఎందరికో ఆదర్శం.

Actress Mayuri Kango

ఇక ఇదే దోవలో ప్రయాణిస్తున్న మరో నటి మయూరి కాంగో..మహేష్ బాబు వంశి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన మయూరి బాలీవుడ్లో చాల చిత్రాల్లో నటించింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్న ఈ బ్యూటీ సినిమాలపై మక్కువతో చదువును వదిలేసింది. ఆ తర్వాత అజయ్ దేవగన్, అనుపమ్ ఖేర్, అర్షద్ వార్సీ, శక్తికపూర్, బాబీ డియోల్, రాణి ముఖర్జి, చంద్రచూడ్ సింగ్, జుగల్ హన్స్‌రాజ్‌తో కలిసి నటించారు.. వెండితెరపైన సరైన అవకాశాలు రాకపోవడంతో కొన్నాళ్లు బుల్లితెరపైన అదృష్టాన్ని పరీక్షించుకొన్నది. అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా సినిమాలను వదిలేసిన మయూరి కాంగో న్యూయార్క్‌లోని జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ ఫైనాన్స్ విద్యను అభ్యసించారు. ప్రస్తుతం గుర్‌గావ్‌లో నివసిస్తున్న మయూరి కాంగో గూగుల్ ఇండియాలో టాప్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను చేపట్టింది.

Actress Aparna, Courtesy by TV9

మరొక హీరోయిన్ అపర్ణ. వెంకటేష్ నటించిన సుందరకాండ చిత్రం గుర్తుందిగా… అందులో వెంకటేష్‌ను ఆటపట్టించే ఒక టీనేజ్ అమ్మాయి పాత్రలో నటించిన నటి పేరే అపర్ణ. ఆ సినిమా తరువాత ఆమె మరలా ఏ ఇతర చిత్రంలోనూ నటించలేదు. 2002లో శ్రీకాంత్ అనే ఎన్నారైని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. అప్పటికే ఇండియాలో చైల్డ్ సైకాలజీలో విద్యను అభ్యసించిన పెళ్లయ్యాక అమెరికాలో డబల్ మాస్టర్స్ చేసి అక్కడ ఒక టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో సైకాలజీ లో ఏడేళ్లుగా ఎంతో మందిని తీర్చుదిద్దుతున్నారు.

Actress Swetha Yamini

ఇక ఇదే తరహాలో జయం చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్వేతా యామిని సైతం చదువుల్లో మొదటి నుండి ముందుండేది అందుకే హీరోయిన్ గా అవకాశాలు వద్దనుకుని మొదట క్యాంపస్ ప్లేసెమెంట్స్ ద్వారా విప్రో లో జాబ్ చేసింది ఆ తర్వాత మాస్టర్స్ అమెరికాలోనే పూర్తి చేసి ఆ తర్వాత వరల్డ్ నెంబర్ వన్ సంస్థ అయినా యూనియన్ బెస్ట్ ట్రేడ్ కంపెనీ లో ఉద్యోగం చేసింది. కానీ కొన్ని కారణాల చేత పెళ్లయ్యాక ఫామిలీ బిజినెస్ ని తన భుజాలపై మోస్తుంది శ్వేతా. ఇవ్వండి నటన వదిలి హీరోయిన్స్ చేస్తున్న, చేసిన కీలక ఉద్యోగాలు.

వీరి ఫొటోస్ మీకోసం

Advertisement
Actress Manya
Actress Swetha Yamini
Actress Swetha Yamini
Actress Swetha Yamini
Actress Swetha Yamini

Continue Reading
Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!