Hollywood Celebrities praises RRR : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రాలలో వచ్చిన పాన్ ఇండియా మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఈ ఏడాది 1000 కోట్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. సినిమా విడుదల అయ్యి 3 నెలలు గడుస్తున్నా సినిమా క్రేజ్ ఇంకా తగ్గట్లేదు. దేశ విదేశాల్లో దుమ్మురేపుతూ ప్రస్తుతం హాలీవుడ్ లో దర్శకనిర్మాతాలను ఆక్కట్టుకుంటోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా ఒక అద్భుతం…
ప్రస్తుతం హాలీవుడ్ లో ప్రముఖులు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు థియేటర్ లో చూస్తుంటే మరికొందరు నెట్ ఫ్లిక్స్ లో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా చూసిన చాలామంది హాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలిజెస్తున్నారు. ఈ కోవలోనే మార్వెల్ చిత్రకారుడు అలిస్ ఎక్స్ జాంగ్, టీవీ మరియు సినీ రచయిత అమీ పాలెట్ హార్ట్మన్ ఆర్ఆర్ఆర్ గురించి స్పందించారు.
RRR is over-the-top ridiculous insanity and it is AMAZING. It’s like Michael Bay and Baz Luhrmann and Stephen Chow teamed up to make a movie. It was 3 hours long but it could have been 4 hours and I would’ve still enjoyed it. pic.twitter.com/gjTbBFJdg8
— Christopher Miller (@chrizmillr) June 14, 2022
So I thought there was no way this year, like absolutely no chance in hell, that there could possibly be a movie more batshit insane than Everything Everywhere All At Once… and then I watched this pic.twitter.com/XEBhy9bam8
— Alice X. Zhang (@alicexz) June 14, 2022
Those who say cinema is dead aren’t looking in the right places. #RRR pic.twitter.com/G8VwlYEPGM
— Larry Karaszewski (@Karaszewski) June 13, 2022
ఇక తాజాగా ఈ కోవలోకి మరో హాలీవుడ్ ప్రముఖుడు చేరాడు. హాలీవుడ్ 21 జంప్ స్ట్రీట్, ది లెగో, స్పైడర్ మ్యాన్ చిత్రాల దర్శకుడు, నిర్మాత క్రిస్టోఫర్ మిల్లర్ ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి తన స్పందనను ట్వీట్ చేశారు. “ఆర్ఆర్ఆర్ ఒక అద్భతం. ఇది మైఖేల్ బే, బాజ్ లుహ్రమాన్ మరియు స్టీఫెన్ చౌ కలిసి సినిమా తీయడం లాంటిది. ఇది 3 గంటల నిడివి ఉంది. కానీ.. 4 గంటలు ఉన్నా చూడొచ్చు. ఈ సినిమా చూస్తూ నేను ఎంతో ఎంజాయ్ చేశాను” అంటూ ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ ట్వీట్ పై ఆనందం వ్యక్తం చేసిన చిత్రనిర్మాణ సంస్థ ట్విట్టర్ లో దీనిని రీట్వీట్ చేసింది.



























