మెగాస్టార్ చిరంజీవీ అంటే టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ అందరికీ తెలుసు. కానీ ఆయన భార్య సురేఖ గురించి చాలా కొద్దిమందికే తెలుసు. అసలు వీళ్ళిద్దరి పెళ్ళి ఎలా జరిగిందో తెలిస్తే చిరు ఫ్యాన్స్ ఖచ్ఛితంగా ఆశ్చర్యపోతారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ ఆదర్శ దంపతులని టాలీవుడ్ ప్రముఖులందరికీ తెలిసిందే. వాళ్లిద్దరి వైవాహిక జీవితం పూర్తయ్యి 40 ఏళ్లైంది.. అయితే తాజాగా చిరు, సురేఖల జీవితాల్లోని అనేక ఆసక్తికరమైన విశేషాలను మెగాస్టార్ చిరంజీవి దంపతులిద్దరూ ఇటీవలే మీడియాతో తమ వైవాహిక దాంపత్య ముచ్చట్లను షేర్ చేసుకున్నారు. అసలు సురేఖతో తన పెళ్ళి ఎలా జరిగిందో ఆయన సరదాగా చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే..
ఈమధ్యనే ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గారు తన పెళ్ళినాటి జ్ణాపకాలను గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. తన క్లాస్మేట్ సత్యనారాయణ ఒకరోజు అనుకోకుండా చెన్నై కోడంబాకం బ్రిడ్జి దగ్గర కనిపించడంతోనే తన జీవితంలోకి సురేఖ ప్రవేశించినట్టు.. తన క్లాస్మేట్కు అల్లు రామలింగయ్య గారు పెదనాన్న అవుతాడని, సత్యన్నారాయణను తన కారులో దింపెందుకు అల్లు వారింటికి వెళ్లినప్పుడే వాళ్ళ కుటుబంతో తొలి పరిచయమైందని.. ఆ రోజుల్లో అల్లు రామ లింగయ్య గార్కి తన కూతురిని ఓ ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాలని కోరిక వుండేదని అని.. కానీ అల్లు అరవింద్ గారి బలవంతంతో తన గురించి విచారించారని చెప్పారు. వాళ్ల విచారణలో తనకు ఏ చెడు అలవాట్లు లేవని, ఆంజనేయస్వామి భక్తుడినని, బాగా చదువుకోవడంతో పాటు బాగా కష్టపడతాననే మంచి గుర్తింపు రావడంతో అల్లు అరవింద్ కుటుంబం వెంటనే తనకి సురేఖనిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారని చిరంజీవి వివరించాడు.
కానీ ఈ పెళ్ళి జరగకముందే అల్లు రామలింగయ్య గారు తన గురించి పది మంది నిర్మాతలను అడిగి పూర్తి వివరాలను సేకరించి.. వారి సలహా తీసుకున్న తర్వాతే తమ పెళ్లికి ఓకే చెప్పారని.. అలా తనను అల్లు వారి ఇంటల్లుడైనట్లుగా చిరంజీవి వివరించారు. ‘మన వూరి పాండవులు’ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవిని చూసిన సురేఖ ‘ఈ కళ్లబ్బాయి ఎవరో బావున్నాడు అనుకున్నాను. కళ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి కదా. మా అమ్మ యాక్టర్ను చేసుకుంది. నేనూ యాక్టర్ను చేసుకుంటే బాగుంటుందనుకున్నా. అందుకే సరే అన్నాను’ అని సురేఖ గారూ తన గత మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కూడా తన పెళ్ళి సంగతులను గుర్తు చేసుకుంటూ.. సురేఖతో తన పెళ్లి చూపులు జరిగినప్పుడు వాళ్ళిద్దరినీ మనసు విప్పి మాట్లాడుకోమని పెద్దవాళ్లందరూ బయటకు వెళ్లారని, అయితే అంతకు ముందు అమ్మాయిలతో పెద్దగా పరిచయాలు లేకపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డానని, కానీ ఆ సమయంలో సురేఖ నడవడిక చూసి ‘ఈ అమ్మాయినే చేసుకోవాలి’ అని నిశ్చయించుకున్నానని… చిరు అమ్మగారికి కూడా సురేఖ బాగా నచ్చిందని.. ఇక చిరంజీవి నాన్నగారైతే ‘ఏం కళరా ఆ అమ్మాయిది. పెళ్లి చేసుకో’ అని తనని ఆదేశించినట్లు మెగాస్టార్ చిరంజీవి అలనాటి విశేషాలను వివరించారు.
చిరంజీవి కుటుంబ సభ్యులంతా తనతో చాలా బాగుంటారని, ఏ బంధమైనా ఇరువైపులా ఉండాలని, చిరంజీవి లేకపోయినా పవన్ కల్యాణ్ ఎప్పుడూ పిల్లలతో సరదాగా ఉండేవాడని అందుకే కల్యాణ్ పిల్లలతోపాటు పెరిగాడని, పిల్లలు కల్యాణ్తో పాటు పెరిగారని సురేఖ చెప్పడం విశేషం.. ఈ ఇంటర్వ్యూను కొనసాగిస్తూ చిరంజీవి తాను ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే సినిమా అవకాశాలు మొదలయ్యాయని, ఆల్బమ్ పట్టుకుని సినిమా ఛాన్స్ ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాలేదని, పెళ్లినాటికే ఫామ్లో ఉన్నానని, ఆ సమయంలో సురేఖకు తాను కనబడటమే అపురూపమని, కానీ మనవరాళ్లు వచ్చాక ఎఫెక్షన్ తగ్గిందని సురేఖపై ‘చిరు’ సరదాగా కౌంటర్ ఇచ్చారు. ఏ సందర్భంలోనైనా తాను సురేఖను పలకరిస్తే ‘ఆ వస్తున్నా’ అంటుందే తప్ప, వచ్చి చూడదని, అందుకే లేటు వయసులో చాలామంది సెకండ్ కోసం చూస్తుంటారని నవ్వుతూ, సురేఖ వైపు కొంటెగా చూస్తూ ఆట పట్టించారు మెగాస్టార్. చిరంజీవి మాటలకు సురేఖ నవ్వుతూ చిరు వైపు అలాగే చూస్తూ ఉండిపోయారు. వాళ్ల సంభాషణల్లో ఎక్కడా దాపరికం కనిపించలేదు. అందుకే 4 దశాబ్దాల వైవాహిక జీవితంలో ఎలాంటి అరమరికలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తున్నారనిపించింది. అదండి సంగతి.. చదివారుగా.. చిరంజీవి గారితో సురేఖ పెళ్ళి ఎలా జరిగిందో.. మరి మీరూ కూడా మీ పెళ్ళి ఆల్బమ్ ను తిరగేస్తూ గత జ్ణాపకాలను గుర్తు చేసుకోండి. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారుగా పెద్దలు..!
Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.
ఇక రాంచరణ్ సినిమాలలో రంగస్థలం సినిమా కూడా ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక సాధారణ వ్యక్తి లాగా సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇచ్చారు ఈ విషయం గురించి సుకుమార్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది.
ఇలా ఒక స్టార్ హీరోని ఇంత సింపుల్గా చూపించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మీలో కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ..కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.
Advertisement
నాలుగైదు టేకులు.. నాలుగైదు టేకులు చేసిన మంచిగా రాకపోవడంతో ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Venu: జబర్దస్త్ కమెడియన్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈయన బలగం అనే సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు తదుపరి సినిమా నానితో చేసే అవకాశాన్ని అందుకున్నారు త్వరలోనే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన విషయాలు తెలియచేయబోతున్నారు.
ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిపి ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమోలో భాగంగా బలగమా సినిమా గురించి ప్రశ్నలు వేశారు.
Advertisement
ఈ సందర్భంగా వేణు సమాధానం చెబుతూ తాను బలగం సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది టెక్నీషియన్ లతో మాట్లాడుతూ ఉండగా కొందరు నన్ను అవమానపరిచారని తెలిపారు. ఏదో పెద్ద బాహుబలి సినిమా చేస్తున్నావా ఏంటి అంటూ అవమానించారని వేణు తెలిపారు.
చిన్న సినిమాలలో బాహుబలి.. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మీరు ఈ సినిమాపై స్పందిస్తూ చిన్న సినిమాలలో బాహుబలి అంటూ కామెంట్స్ చేయడం తను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా వేణు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.
ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.
Advertisement
జగన్ అంటే అభిమానం.. ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.